News September 1, 2024

TPCC చీఫ్‌గా మహేశ్‌కుమార్ గౌడ్.. ఏ క్షణమైనా ప్రకటన?

image

TG: టీపీసీసీ చీఫ్‌గా ఎమ్మెల్సీ బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్‌ను నియమిస్తూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన నియామకానికి ఆమోదం తెలుపుతూ ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే సంతకం కూడా చేసినట్లు సమాచారం. ఇందుకు సంబంధించి ఏ క్షణమైనా అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. కాగా బీసీ సామాజికవర్గం నుంచి ఈ పదవికి మధుయాష్కీ గౌడ్ పోటీపడినా మహేశ్ వైపే అగ్ర నేత సోనియా గాంధీ మొగ్గు చూపినట్లు సమాచారం.

Similar News

News February 1, 2025

ట్రంప్ ప్రతిపాదన తిరస్కరణ

image

గాజాలోని పాలస్తీనీయులకు పొరుగు దేశాల్లో పునరావాసం కల్పించాలన్న ట్రంప్ ప్రతిపాదనను ఆయా దేశాలు తిరస్కరించాయి. ఈ మేరకు ఈజిప్ట్, జోర్డాన్, సౌదీ అరేబియా, UAE, ఖతర్, పాలస్తీనా అథారిటీ, అరబ్ లీగ్‌లు సంయుక్త ప్రకటన చేశాయి. ఇజ్రాయెల్ దాడులతో గాజా శిథిలాల కుప్పగా మారడంతో పాటు కనీస సౌకర్యాలు కరవయ్యాయని, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ట్రంప్ ఇటీవల ఆయా దేశాలకు ప్రతిపాదించిన విషయం తెలిసిందే.

News February 1, 2025

అకౌంట్లోకి రూ.20,000.. కీలక ప్రకటన

image

AP: ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామని రాయచోటి సభలో సీఎం చంద్రబాబు వెల్లడించారు. పెన్షన్లు పెంచి పేదల జీవితాల్లో వెలుగులు నింపామన్న ఆయన ఆడబిడ్డలకు ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నామన్నారు. కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రైతు భరోసా కింద రూ.20వేలు మే నెలలో అందిస్తామన్నారు. అలాగే తల్లికి వందనం పథకాన్ని ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని ప్రకటించారు.

News February 1, 2025

శ్రీలంకను మట్టికరిపించిన ఆసీస్

image

తొలి టెస్టులో SLను ఆస్ట్రేలియా మట్టికరిపించింది. గాలే వేదికగా జరిగిన టెస్టులో వార్ వన్ సైడ్ అయింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆసీస్ 654-6 వద్ద డిక్లేర్ చేసింది. తొలి INGలో 165కే ఆలౌట్ అయిన శ్రీలంక ఫాలో ఆన్ ఆడింది. 4వ రోజు అందులోనూ 247 పరుగులకే ఆలౌట్ కావడంతో ఆసీస్ ఓ ఇన్నింగ్స్ & 242 రన్స్ తేడాతో గెలుపొందింది. టెస్టుల్లో AUSకు ఇది నాలుగో అతిపెద్ద విజయం. డబుల్ సెంచరీ చేసిన ఖవాజాకు POTM అవార్డు దక్కింది.