News September 1, 2024

రేపు ఈ జిల్లాల్లో స్కూళ్లకు సెలవు

image

భారీ వర్షాలు, వరదలతో తెలుగు రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. రేపు కూడా భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లాలో స్కూళ్లకు సెలవు ప్రకటించారు. అటు హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ఇచ్చారు. స్థానిక పరిస్థితులను బట్టి రేపు సెలవు ప్రకటించడంపై అధికారులు ఇవాళ సాయంత్రం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.

Similar News

News March 6, 2025

తెలంగాణ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

image

☛ ఫ్యూచర్ సిటీ బోర్డుకు ఆమోదం
☛ నదీ జలాల అంశంపై ప్రత్యేక కమిటీ వేయాలని నిర్ణయం
☛ ఉగాది నుంచి ‘భూ భారతి’ అమలు
☛ ఈనెల 12 నుంచి 27 వరకు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు
☛ కొత్తగా 10,950 విలేజ్ లెవల్ ఆఫీసర్ పోస్టులు
☛ కొత్త రెవెన్యూ డివిజన్లు, కొత్త మండలాలకు 217 పోస్టులు
☛ 10 జిల్లా కోర్టులకు 55 పోస్టుల మంజూరు

News March 6, 2025

భారత్‌కు ఆదివారం భయం!

image

IND అభిమానులను ఆదివారం భయపెడుతోంది. ఇప్పటివరకు ICC ట్రోఫీల్లో ఆదివారం తప్ప మిగతా రోజుల్లో జరిగిన అన్ని ఫైనల్స్‌లో భారత్ గెలిచింది. 1983 (శనివారం), 2002 CT (సోమవారం), 2007 టీ20 WC (సోమవారం), 2011 వన్డే WC (శనివారం), 2013 CT (సోమవారం), 2024 టీ20 WC (శనివారం) కప్పులు సొంతం చేసుకుంది. 2000 CT, 2014 T20 WC, 2017 CT, 2003, 23 వన్డే WC ఫైనల్స్ ఆదివారం జరగ్గా భారత్ ఓడిపోయింది. ఈసారి CT ఫైనల్ ఆదివారమే మరి!

News March 6, 2025

బ్యాలెట్‌ విధానంలో ఎన్నికల కోసం డిమాండ్‌ చేయాలి: జగన్

image

కేంద్రం, రాష్ట్రంలో ఒకేసారి ఎన్నికలు జరిగితే బ్యాలెట్‌ విధానంలో పోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేయాలని YCP MPలకు జగన్ సూచించారు. ‘వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌’‌పై పార్లమెంటులో చర్చ జరిగే అవకాశమున్న నేపథ్యంలో వారికి సూచనలు చేశారు. అభివృద్ధి చెందిన దేశాల్లో ఇప్పుడు బ్యాలెట్‌ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారని, మొదట్లో EVMలతో నిర్వహించిన దేశాలు కూడా తర్వాత బ్యాలెట్‌ విధానానికి మళ్లాయని గుర్తు చేశారు.

error: Content is protected !!