News September 1, 2024

ప్లీన‌రీపై బీఆర్ఎస్ అధిష్ఠానం దృష్టి

image

పార్టీ ప్లీన‌రీ నిర్వ‌హ‌ణ‌పై BRS నాయ‌క‌త్వం దృష్టిసారించిన‌ట్టు తెలుస్తోంది. త్వ‌ర‌లో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో అంత‌కంటే ముందే ప్లీన‌రీ నిర్వ‌హించాల‌నే యోచ‌న‌లో మాజీ సీఎం కేసీఆర్ ఉన్న‌ట్టు పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి. అంతేకాకుండా, అసెంబ్లీ, లోక్‌స‌భ ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో డీలా ప‌డిన క్యాడ‌ర్‌లో ఉత్సాహం నింపేలా HYD బ‌య‌ట ప్లీనరీ నిర్వ‌హించాల‌నే యోచ‌న‌లో BRS ఉన్న‌ట్టు స‌మాచారం.

Similar News

News January 15, 2026

ఐనవోలు: మీడియా సెంటర్‌పై నిర్లక్ష్యం..!

image

ఐనవోలు మల్లికార్జున స్వామి జాతర కవరేజ్ కోసం వచ్చే మీడియా ప్రతినిధులకు అధికారులు మీడియా సెంటర్ ఏర్పాటు చేశారు. కానీ అందులో కుర్చీలు వేయకపోవడంతో ఇతర శాఖలకు చెందిన కార్లు, ద్విచక్రవాహనాలను అందులో పార్కింగ్ చేస్తున్నారు. దీంతో మీడియా ప్రతినిధులకు చోటు లేకుండా పోయింది. ప్రముఖులు దర్శనానికి వచ్చిన సమయంలో మీడియాతో మాట్లాడాలన్నా ఆలయ ఆవరణే దిక్కయింది.

News January 15, 2026

ఎన్నికల్లో ఇంకుకు బదులు మార్కర్ పెన్నులు: రాజ్ ఠాక్రే

image

మహారాష్ట్ర లోకల్ బాడీ ఎన్నికల్లో ఇంకుకు బదులు మార్కర్ పెన్నులు వాడుతున్నారని MNS చీఫ్ రాజ్ ఠాక్రే ఆరోపించారు. ‘ఇది కుట్ర. ఇలాంటి మోసపూరిత ఎన్నికలు ఎందుకు?’ అని ప్రశ్నించారు. సిస్టమ్‌ను మేనేజ్ చేసి ఎలాగైనా గెలవడానికే ప్రభుత్వం ఇలాంటి వేషాలు వేస్తోందని విమర్శించారు. డబుల్ ఓటింగ్ జరిగే ఛాన్స్ ఉందని ఆరోపించారు. రాజకీయ పార్టీలను అడగకుండా ఇలాంటి మార్పులు చేయడంపై జనం అలర్ట్‌గా ఉండాలని పిలుపునిచ్చారు.

News January 15, 2026

మీ ఇంటి గోవులను రేపు ఎలా పూజించాలంటే?

image

కనుమ రోజున ఆవులను, ఎడ్లను చెరువులు, బావుల వద్దకు తీసుకువెళ్లి శుభ్రంగా స్నానం చేయించాలి. ఆపై వాటి కొమ్ములకు రంగులు పూసి, మెడలో గంటలు, పూలమాలలు వేసి అందంగా అలంకరించాలి. నుదుటన పసుపు, కుంకుమలు పెట్టి హారతి ఇవ్వాలి. కొత్త బియ్యంతో వండిన పొంగలిని లేదా పచ్చగడ్డి, బెల్లం కలిపిన పదార్థాలను నైవేద్యంగా తినిపించాలి. చివరగా గోవు చుట్టూ ప్రదక్షిణలు చేసి నమస్కరించుకోవడం ద్వారా ఆ దేవతల ఆశీస్సులు పొందవచ్చు.