News September 1, 2024
వేధింపుల వెనుక ఆ పార్టీ నేతలు: నడ్డా
హేమ కమిటీ నివేదిక ద్వారా మాలీవుడ్లో వెలుగుచూసిన వేధింపుల బాధితులకు న్యాయం చేయడంలో కేరళ ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని BJP జాతీయ అధ్యక్షుడు JP నడ్డా ప్రశ్నించారు. కేరళ పర్యటనలో ఆయన మాట్లాడుతూ వేధింపుల వెనుక కమ్యూనిస్ట్ నేతల ప్రమేయం ఉందని ఆరోపించారు. ఈ విషయాన్ని నివేదిక స్పష్టం చేసిందని, పార్టీ నేతలను రక్షిస్తున్నారని మండిపడ్డారు. దీనిపై CM స్పందించాలని డిమాండ్ చేశారు.
Similar News
News February 2, 2025
పుట్టిన రోజు శుభాకాంక్షలు
ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.
News February 2, 2025
3 ఏళ్లలో 200 కొత్త వందేభారత్ రైళ్లు: అశ్వినీ వైష్ణవ్
2025-26లో 2వేల జనరల్ కోచ్ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. ఈ ఏడాది 100% ఎలక్ట్రిఫికేషన్ పూర్తిచేస్తామని చెప్పారు. మూడేళ్లలో 200 కొత్త వందేభారత్ రైళ్లు, 100 అమృత్ భారత్, 50 నమో భారత్ ర్యాపిడ్ రైళ్లు, 17,500 జనరల్, నాన్ ఏసీ కోచ్లు అందుబాటులోకి వస్తాయన్నారు. కొత్త లైన్లు, డబ్లింగ్, ఫ్లైఓవర్, అండర్పాస్ల నిర్మాణానికి ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు.
News February 2, 2025
రైల్వేకు కేటాయింపులు ఇలా(రూ.కోట్లలో)
✒ మొత్తం బడ్జెట్- 2,65,200
✒ ఉద్యోగుల పెన్షన్ ఫండ్- 66,000
✒ రైల్వే సేఫ్టీ ఫండ్- 45,000
✒ కొత్త లైన్ల నిర్మాణం- 32,235
✒ లైన్ల డబ్లింగ్- 32,000
✒ గేజ్ లైన్లుగా మార్పునకు- 4,500
✒ విద్యుత్ లైన్లు- 6,150
✒ సిబ్బంది సంక్షేమం- 833
✒ ఉద్యోగుల శిక్షణ- 301