News September 1, 2024

ఆగస్టులో జీఎస్టీ వసూళ్లు ₹1.75 లక్షల కోట్లు

image

గతేడాది ఆగస్టులో ₹1.59 లక్షల కోట్ల జీఎస్టీ వసూళ్లు నమోదవగా, ఈ ఏడాది అదే నెలలో ₹1.75 లక్షల కోట్లు వసూలైనట్లు కేంద్రం వెల్లడించింది. మొత్తంగా 10% వృద్ధి నమోదైనట్లు తెలిపింది. ఈ ఏడాది ఇప్పటి వరకు ₹9.13 లక్షల కోట్లు వచ్చినట్లు పేర్కొంది. ఆగస్టులో డొమెస్టిక్ రెవెన్యూ 9.2% వృద్ధితో ₹1.25 లక్షల కోట్లు, దిగుమతుల ద్వారా 12.1% వృద్ధితో ₹49,976 కోట్ల ఆదాయం వచ్చినట్లు ప్రకటించింది.

Similar News

News February 1, 2026

గుంటూరు జిల్లాలో 45 పోస్టులు.. అప్లై చేశారా?

image

AP: గుంటూరు జిల్లాలోని UPHC, PHCలో ఖాళీగా ఉన్న 45 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, DMLT, BSc(BZC), PG డిప్లొమా(మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ), D.ఫార్మసీ, B.ఫార్మసీ, M.ఫార్మసీ, PGDCA అర్హతగల వారు <>DHMO<<>>లో అప్లై చేసుకోవాలి. అభ్యర్థుల గరిష్ఠ వయసు 42ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. మెరిట్, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://guntur.ap.gov.in

News February 1, 2026

సంప్రదాయాన్ని బ్రేక్ చేయనున్న నిర్మల

image

కేంద్ర మంత్రి నిర్మల 75 ఏళ్ల సంప్రదాయాన్ని బ్రేక్ చేయనున్నారు. 2 భాగాల బడ్జెట్‌లో పార్ట్ Aకు సాధారణంగా ప్రాధాన్యం ఇస్తారు. ఆర్థిక స్థితిని సమీక్షించే, విధాన దిశను నిర్దేశించే ముఖ్యమైన అంశాలు అందులో ఉంటాయి. పన్ను సంబంధిత ప్రకటనలకే పార్ట్Bని పరిమితం చేస్తారు. ఈ సారి పార్ట్ B ద్వారానే ఇండియా ఎకనమిక్ విజన్‌ను నిర్మల ఆవిష్కరించనున్నారు. ట్రేడ్, కస్టమ్స్, ఎగుమతులు, తయారీపై ఫోకస్ చేస్తారని తెలుస్తోంది.

News February 1, 2026

నిద్ర లేవగానే ఎన్ని నీళ్లు తాగాలి?

image

ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగితే ఆరోగ్యానికి మంచిది. అయితే ఎన్ని తాగాలనే దానిపై పలువురికి సందేహం ఉంటుంది. వైద్యుల సూచన మేరకు ఖాళీ కడుపుతో 1-2 గ్లాసుల(సుమారు 500ML) వరకు తాగొచ్చు. ఇది రాత్రంతా డీహైడ్రేషన్‌కు గురైన శరీరాన్ని యాక్టివేట్ చేస్తుంది. జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి చర్మ ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఎక్కువగా తాగితే కిడ్నీలపై భారం పడుతుంది. కడుపు ఉబ్బరం, వాంతులు, తలనొప్పి వంటి సమస్యలొస్తాయి.