News September 1, 2024
ప్రకాశం జిల్లాలో నేటి ముఖ్యాంశాలు

*ప్రకాశం: రేపు విద్యా సంస్థలకు సెలవు
*ప్రకాశం జిల్లాలో ముగ్గురు చిన్నారులు మృతి
*కంభంలో సముద్రం కప్పలు ప్రత్యక్షం
*దోర్నాల: ఘాట్ రోడ్లో విరిగిపడ్డ కొండ చరియలు
*రేపు కలెక్టర్ మీకోసం కార్యక్రమం రద్దు
*యూరప్ నుంచి ప్రకాశం జిల్లాకు చేరిన మృతదేహం
*‘కనిగిరిలో బాలకృష్ణ 50 ఏళ్ల సినీ వేడుకలు’
*దర్శి కమిషనర్ పనితీరుపై హర్షం
*కంభంలో బులెట్ బైక్ దొంగతనం
Similar News
News September 17, 2025
ఒంగోలులో పిడుగుపాటు.. పదేళ్ల బాలుడి మృతి.!

ఒంగోలులో పిడుగుపాటుకు గురై పదేళ్ల బాలుడు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. బుధవారం తెల్లవారుజామున ఒక్కసారిగా ఉరుములు, మెరుపులతో ఒంగోలు నగరం దద్దరిల్లింది. ఈ నేపథ్యంలోనే ఒంగోలు శివారు ప్రాంతంలో పదేళ్ల బాలుడు ఇంటి వద్ద ఉన్న క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడినట్లు సమాచారం. దీంతో బాలుడు మృతి చెందగా ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతి చెందిన బాలుడు కంకణాల చందుగా తెలుస్తోంది.
News September 17, 2025
S.కొండ: ఫోక్సో కేసుపై DEO కార్యాలయంలో చర్చ

ఒంగోలు DEO కార్యాలయంలో సింగరాయకొండలో జరిగిన ఫోక్సో కేసు అంశంపై మంగళవారం చర్చ జరిగింది. ఈ సమావేశంలో డీఈఓ కిరణ్ కుమార్, డిప్యూటీ ఈవో చంద్రమౌళీశ్వరు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పాఠశాలల్లో జరిగిన లైంగిక వేధింపుల కేసులను 164 స్టేట్మెంట్ ఆధారంగా తప్పుడు రీతిలో రిఫర్ చేస్తున్న పరిస్థితిపై చర్చ సాగింది. దీనిపై తగిన చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని డీఈఓ తెలిపారు.
News September 17, 2025
తల్లి ప్రేరేపనతోనే భార్యను హింసించిన భర్త: బంధువులు

ప్రకాశం జిల్లా కలుజువ్వలపాడుకు చెందిన బాలాజీ భార్య భాగ్యలక్ష్మిని <<17730782>>భర్త విచక్షణారహితంగా కొట్టి<<>>న విషయం తెలిసిందే. కాగా వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఒక బాబు. ఆమెను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం వేరే మహిళతో హైదరాబాదులో ఉంటున్నాడు. భార్య స్థానికంగా ఓ బేకరీలో పనిచేసుకుంటూ జీవనం సాగిస్తుంది. హైదరాబాద్ నుంచి వచ్చిన భర్త తనతల్లి ప్రేరేపనతో భార్యను హింసిస్తుంటాడని బాధితురాలి బంధువులు ఆరోపించారు.