News September 2, 2024

GST: APలో తగ్గుదల.. TGలో పెరుగుదల

image

ఆగస్టులో ఏపీ జీఎస్టీ వసూళ్లు 5 శాతం తగ్గినట్లు కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించింది. గత ఏడాది ఇదే నెలలో రూ.3,479 కోట్లు వసూలవగా, ఈ ఏడాది రూ.3,298 కోట్లకు తగ్గినట్లు తెలిపింది. మరోవైపు తెలంగాణలో 4 శాతం వృద్ధి నమోదైనట్లు పేర్కొంది. గత ఏడాది ఆగస్టులో రూ.4,393 కోట్లు వసూలవగా, ఈసారి ఆ మొత్తం రూ.4,569 కోట్లకు పెరిగినట్లు ప్రకటించింది.

Similar News

News February 2, 2025

ట్రంప్ మరో కీలక నిర్ణయం

image

కెనడా, మెక్సికో, చైనా దిగుమతులపై టారిఫ్ విధిస్తున్నట్లు US అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. కెనడా, మెక్సికో ఇంపోర్ట్స్‌పై 25%, చైనా దిగుమతులపై 10% పన్ను విధిస్తున్నట్లు పేర్కొన్నారు. అంతర్జాతీయ అత్యవసర ఆర్థిక అధికారాల చట్టం(IEEPA) కింద ఈ చర్యలు తీసుకున్నట్లు ట్వీట్ చేశారు. డ్రగ్స్ అక్రమ రవాణా, అక్రమ వలసలను నిరోధించి దేశ ప్రజలకు మెరుగైన భద్రతను ఇవ్వడానికి ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు.

News February 2, 2025

వసంత పంచమి ఎప్పుడు? క్లారిటీ

image

వసంతి పంచమి ఇవాళా? రేపా? అని ప్రజల్లో ఉన్న సందిగ్ధతపై పండితులు క్లారిటీ ఇచ్చారు. ‘ఇవాళ ఉ.9.45 గంటల వరకు చవితి తిథి ఉంది. ఆ తర్వాత పంచమి మొదలవుతుంది. రేపు ఉ.6.50 నిమిషాలకు సూర్యోదయం ఉంటే, పంచమి తిథి ఉ.6.52 వరకు మాత్రమే ఉంది. కేవలం 2 నిమిషాలకు పర్వదినాన్ని నిర్ణయించలేం. అందుకే 2వ తేదీనే పండుగ చేసుకోవాలి. ఇవాళ ఉ.7:09 గంటల నుంచి మ.12:35 గంటల వరకు పూజకు మంచి సమయం’ అని చెబుతున్నారు.

News February 2, 2025

వసంత పంచమి: ఏం చేయాలి?

image

✒ పూజా మందిరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఓ పీటకు పసుపు రాసి బియ్యం పిండితో స్వస్తిక్ గుర్తు వేయాలి. సరస్వతీ దేవి ఫొటోను ఉంచి అలంకరించాలి. పుస్తకాలు, పూలను ముందు పెట్టుకోవాలి.
✒ ఆవు నెయ్యితో 9వత్తులతో దీపాలు వెలిగించాలి.
✒ ఓ గ్లాసు నీటిని ఎడమ చేతిలో పట్టుకుని దానిమీద కుడిచేతిని ఉంచాలి. ఆ తర్వాత ‘ఓం ఐం వాన్యై స్వాహా’ అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి.
✒ ఆ నీటిని పిల్లల చేత తాగిస్తే దేవి అనుగ్రహం ఉంటుంది.