News September 2, 2024
మంత్రులపై కేటీఆర్ బురదజల్లే ప్రయత్నం: రేవంత్
TG: రాష్ట్రాన్ని వరదలు ముంచెత్తినా మౌనంగా ఉన్న కేసీఆర్కు ప్రధాన ప్రతిపక్ష హోదా అవసరం లేదని భావిస్తున్నట్లు సీఎం రేవంత్ చెప్పారు. ప్రజలకు కష్టం వచ్చినా ఆయన స్పందించరని విమర్శించారు. అమెరికా పర్యటనలో ఉన్న కేటీఆర్ మంత్రులపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. ఆయన ట్విటర్ ద్వారానే మాట్లాడుతారని సెటైర్లు వేశారు. విపత్తులు వచ్చినప్పుడు ప్రభుత్వంతో కలిసి ప్రతిపక్షాలు పనిచేయాలని సూచించారు.
Similar News
News February 2, 2025
CM రేవంత్ను ఎర్రగడ్డ ఆస్పత్రిలో చూపించాలి: RS ప్రవీణ్
TG: KCR శారీరక స్థితి గురించి ఇటీవల CM రేవంత్ చేసిన <<15322522>>వ్యాఖ్యలపై<<>> BRS నేత RS.ప్రవీణ్ మండిపడ్డారు. ‘రేవంత్ మానసిక స్థితిపై అనుమానాలున్నాయి. ఆయన మాటలు చూస్తుంటే యాంటీ సోషల్ పర్సనాలిటీ డిజార్డర్, బైపోలార్ డిజార్డర్ రోగి లక్షణాలుగా కనిపిస్తున్నాయి. CM బాధ్యతలు ఎవరికైనా తాత్కాలికంగా అప్పజెప్పి వారిని ఎర్రగడ్డ ఆస్పత్రిలో చూపిస్తే బాగుంటుందేమో. దీని గురించి వారి ఫ్యామిలీ ఆలోచించాలి’ అని పేర్కొన్నారు.
News February 2, 2025
ఇండియాకు WC అందించిన గొంగడి త్రిష
అండర్-19 ఉమెన్స్ WCలో 19 ఏళ్ల తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిష సంచలనం సృష్టించారు. 7 మ్యాచుల్లో 309 రన్స్ చేసి భారత్ ప్రపంచకప్ గెలవడంలో కీలకపాత్ర పోషించారు. ఇందులో ఒక సెంచరీ కూడా ఉంది. యావరేజ్ 77, స్ట్రైక్ రేట్ 144గా ఉండటం విశేషం. ఈ WCలో అత్యధిక రన్స్ త్రిషవే. బౌలింగ్లోనూ సత్తా చాటి 7 వికెట్లు తీశారు. భద్రాచలంకు చెందిన త్రిష ఈ WCలో ఓపెనర్గా వచ్చి 4, 27, 49, 40, 110, 44 రన్స్ చేశారు.
News February 2, 2025
పోలవరం ఎత్తు తగ్గింపుతో తీవ్ర నష్టం: బొత్స
AP: 16 మంది ఎంపీలు ఉన్నా కేంద్రం నుంచి నిధులు సాధించడంలో టీడీపీ విఫలమైందని వైసీపీ నేత, ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ విమర్శించారు. బడ్జెట్లో ఏపీ అభివృద్ధికి కనీస కేటాయింపుల్లేవని అన్నారు. బిహార్ లబ్ధి పొందింది కానీ ఏపీకి ప్రాధాన్యత దక్కలేదని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును 45.72 మీటర్ల నుంచి 41.5 మీటర్లకు కుదించారని, దీని వల్ల ఉత్తరాంధ్రకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు.