News September 3, 2024
72 ఏళ్ల బామ్మ అకౌంట్ నుంచి రూ.72 లక్షలు కాజేశారు

RBI, CBI పేర్లు చెప్పి ఆర్థిక మోసాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి మోసానికి గురై కేరళకు చెందిన 72 ఏళ్ల బామ్మ రూ.72 లక్షలు మోసపోయింది. RBI నుంచి ఫోన్ చేస్తున్నామని పరిచయం చేసుకొని క్రెడిట్ కార్డ్ బ్లాక్ అయిందని ఒకరు, సీబీఐ అని చెప్పి మనీలాండరింగ్ కేసు నమోదైందంటూ మరొకరు ఫోన్ చేసి ఆమెను భయపెట్టారు. ఈ క్రమంలో బామ్మ బ్యాంక్ వివరాలు సేకరించిన కేటుగాళ్లు ఆమె అకౌంట్లోని రూ.72 లక్షలు కాజేశారు.
Similar News
News November 5, 2025
సంతానలేమిని నివారించే ఖర్జూరం

ఖర్జూరాలు మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడతాయని.. మగవారిలో సంతానలేమి సమస్యను నివారించడంలో ఉపయోగపడతాయని పలు అధ్యయనాల్లో తేలింది. వీటిలో ఉన్న పొటాషియం నరాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఖర్జూరాల్లో అధికంగా ఉండే పీచు జీర్ణ ప్రక్రియకు మంచిది. ఇందులోని కెరోటనాయిడ్ అనే యాంటీ ఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే ఐరన్, విటమిన్ C, D, విటమిన్ B కాంప్లెక్స్ గర్భిణులకు మంచివని చెబుతున్నారు.
News November 5, 2025
SSC-కంబైన్డ్ హిందీ ట్రాన్స్లేటర్ ఫలితాలు రిలీజ్

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(<
News November 5, 2025
రేపే బిహార్ తొలిదశ పోలింగ్

బిహార్ అసెంబ్లీ ఎన్నికల తొలి దశ ప్రచారానికి నిన్నటితో తెరపడింది. 18 జిల్లాల పరిధిలోని 121 సెగ్మెంట్లలో రేపు పోలింగుకు ఈసీ ఏర్పాట్లన్నీ పూర్తిచేసింది. ఈ దశలో 8 మంది మంత్రులతోపాటు డిప్యూటీ సీఎం సామ్రాట్ చౌధరి, ఆర్జేడీ చీఫ్ తేజస్వీ యాదవ్, ఆయన సోదరుడు, JJL పార్టీ అధ్యక్షుడు తేజ్ ప్రతాప్ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. కాగా ఈ నెల 11న మరో 122 స్థానాల్లో పోలింగ్, 14న కౌంటింగ్ జరగనుంది.


