News September 3, 2024

హైకోర్టు ప్రాంగణంలోనూ కల్తీ ఆహారం

image

కల్తీ ఆహారానికి అడ్డుకట్ట పడటం లేదు. ఏకంగా హైకోర్టు ప్రాంగణంలోనే ఫుడ్ లైసెన్సులు లేకుండా, అపరిశుభ్ర వాతావరణంలో ఆహార పదార్థాలు విక్రయిస్తున్న సంగతి రాజస్థాన్‌లో బయటపడింది. కుళ్లిన ఆలు, ఉల్లి, ఇతర ఆహార పదార్థాలు, కృత్రిమ రంగులు, ఫ్రిజ్‌లో ఫంగస్, పాడైపోయిన గిన్నెలు, స్టౌవ్‌లు, గడువు ముగిసిన ఉత్పత్తులను అధికారులు గుర్తించారు. లైసైన్స్ పొందేవరకు ఆహారం అమ్మకుండా క్యాంటీన్ ఓనర్లపై చర్యలు తీసుకున్నారు.

Similar News

News March 11, 2025

శబరిమల: 18 మెట్లు ఎక్కగానే స్వామి దర్శనం

image

శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్. అక్కడి అయ్యప్ప గుడిలోని సన్నిధానంలో 18 మెట్లను ఎక్కగానే స్వామి దర్శనం అయ్యేలా మార్పులు చేయాలని దేవస్థానం నిర్ణయించింది. ఈ నెల 15 నుంచి 12 రోజుల పాటు దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేసి, విజయవంతమైతే రానున్న మండల మకరవిళక్కు సీజన్ నుంచి కొనసాగిస్తామంది. సాధారణంగా మెట్లు ఎక్కగానే భక్తులను ఓ వంతెన మీదికి మళ్లించి కొంత సమయం క్యూలో ఉంచిన తర్వాతే దర్శనానికి అనుమతిస్తారు.

News March 11, 2025

WPL: గెలిస్తే నేరుగా ఫైనల్‌కు

image

WPL 2025లో ముంబై ఇండియన్స్ మరోసారి ఫైనల్‌కి చేరువైంది. ఇవాళ బెంగళూరుతో జరిగే మ్యాచులో గెలిస్తే నేరుగా ఫైనల్ చేరనుంది. నిన్నటి మ్యాచులో గుజరాత్‌పై గెలిచి పాయింట్ల పట్టికలో MI(10P) రెండో స్థానానికి దూసుకొచ్చింది. ఢిల్లీకీ 10 పాయింట్లే ఉన్నా NRR ఎక్కువ ఉండటంతో తొలి స్థానంలో ఉంది. ఇవాళ్టి మ్యాచులో MI ఓడితే ఎలిమినేటర్‌లో గుజరాత్‌తో తలపడనుంది.

News March 11, 2025

ఆర్థికమాంద్యం ముప్పులో అమెరికా!

image

అమెరికా స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. అధ్యక్షుడు ట్రంప్ టారిఫ్ నిబంధనలతో ఆర్థిక వ్యవస్థ మందగిస్తుందని ఇన్వెస్టర్లు భావించడంతో నాస్‌డాక్ 4 శాతం క్షీణించింది. 2022 తర్వాత ఒక్కరోజులో అతిపెద్ద నష్టం ఇదే. టెస్లా, Nvidia, మెటా, అమెజాన్, ఆల్ఫాబెట్ షేర్లు భారీగా నష్టపోయాయి. 1.9 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. ఈ ఏడాది అమెరికాలో ఆర్థికమాంద్యం వచ్చే అవకాశాలు 40%కి పెరిగినట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.

error: Content is protected !!