News September 3, 2024
IAS ఆఫీసర్.. పారాలింపిక్స్లో రికార్డు సృష్టించారు

పారిస్ పారాలింపిక్స్ మెన్స్ సింగిల్స్ SL4 విభాగంలో షట్లర్ సుహాస్ యతిరాజ్ సిల్వర్ మెడల్ సాధించారు. ఈయన 2020 టోక్యో పారాలింపిక్స్లోనూ రజతం గెలిచారు. తద్వారా పారాలింపిక్స్లో రెండు మెడల్స్ సాధించిన తొలి భారత పారా షట్లర్గా చరిత్ర సృష్టించారు. ఈయన IAS ఆఫీసర్ కూడా. 2007 యూపీ క్యాడర్కు ఎంపికైన సుహాస్ ప్రస్తుతం గౌతమ్ బుద్ద నగర్ కలెక్టర్గా పనిచేస్తున్నారు. 2021లో అర్జున అవార్డును పొందారు.
Similar News
News September 19, 2025
మైథాలజీ క్విజ్ – 10 సమాధానాలు

1. శ్రీరాముడి పాదధూళితో ‘అహల్య’ శాపవిముక్తురాలైంది.
2. కురుక్షేత్ర యుద్ధంలో శకునిని చంపింది ‘సహదేవుడు’.
3. కృష్ణద్వైపాయనుడు అంటే ‘వేద వ్యాసుడు’.
4. మధుర మీనాక్షి దేవాలయం ‘వైగై నది’ ఒడ్డున ఉంది.
5. చిరంజీవులు ఏడుగురు. వారు 1. అశ్వత్థామ 2. బలి చక్రవర్తి 3. వ్యాస మహర్షి 4. హనుమంతుడు 5. విభీషణుడు 6. కృపాచార్యుడు 7. పరశురాముడు <<-se>>#mythologyquiz<<>>
News September 19, 2025
జూ.ఎన్టీఆర్ ఎలా గాయపడ్డారంటే?

ఓ ప్రైవేట్ యాడ్ షూట్ చేస్తుండగా జూ.ఎన్టీఆర్ <<17762493>>గాయపడ్డ<<>> విషయం తెలిసిందే. సెట్లో చీకటి ఉండటంతో స్టేజీ ఎడ్జ్ నుంచి ఆయన జారి కిందపడ్డట్లు సినీ వర్గాలు తెలిపాయి. దీంతో తారక్ పక్కటెముకలు, చేతికి స్వల్పగాయాలైనట్లు పేర్కొన్నాయి. ఎన్టీఆర్ను పరీక్షించిన వైద్యులు ఎలాంటి ఆందోళన అవసరం లేదని చెప్పినట్లు సమాచారం. చికిత్స అనంతరం తారక్ ఇంటికి వెళ్లిపోయినట్లు తెలుస్తోంది.
News September 19, 2025
అసెంబ్లీ సమావేశాలు వాయిదా

AP అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇవాళ రెండో రోజు సందర్భంగా పలు అంశాలపై స్వల్పకాలిక చర్చలు జరిగాయి. నీటి నిర్వహణపై సీఎం చంద్రబాబు ప్రసంగించారు. అనంతరం సభను సోమవారానికి స్పీకర్ వాయిదా వేశారు. ఈ నెల 27వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే.