News September 3, 2024
తిరిగొస్తున్న FII, FPIలు.. ఎందుకంటే

జులై 23 నుంచి ఆగస్టు 21 వరకు రూ.60వేల కోట్ల పెట్టుబడుల్ని వెనక్కి తీసుకున్న FII, FPIలు మళ్లీ భారత్ బాట పట్టారు. వారం రోజులుగా స్టాక్ మార్కెట్లలో కొనుగోళ్లు చేపట్టారు. వడ్డీరేట్ల కోతకు సమయం వచ్చేసిందన్న US ఫెడ్ సంకేతాలే ఇందుకు కారణమని తెలిసింది. విధాన రేట్లు తగ్గితే US బాండ్ యీల్డులు క్షీణిస్తాయి. పైగా అక్కడ రెసెషన్ భయాలు ఉన్నాయి. భారత ఈక్విటీ మార్కెట్లలో మెరుగైన రాబడి పొందొచ్చని FII, FPIల భావన.
Similar News
News August 6, 2025
రూ.1,000 పెరిగిన వెండి ధర

బంగారం ధరలు వరుసగా మూడో రోజు పెరిగాయి. హైదరాబాద్లో ఇవాళ 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర ₹110 పెరిగి ₹1,02,330కు చేరింది. ఇక 22 క్యారెట్ల గోల్డ్ 10 గ్రాముల ధర ₹100 పెరిగి ₹93,800 పలుకుతోంది. 5 రోజుల్లో బంగారం ధర రూ.2,510 పెరగడం గమనార్హం. అటు కేజీ వెండిపై రూ.1,000 పెరిగి రూ.1,26,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News August 6, 2025
‘రాజాసాబ్’ పార్ట్-2 ఉంటుంది: విశ్వప్రసాద్

ప్రభాస్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రాజాసాబ్’కు పార్ట్-2 ఉంటుందని నిర్మాత విశ్వప్రసాద్ తెలిపారు. అయితే జోనర్ వేరే ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. ‘రాజాసాబ్’ రిలీజ్ వాయిదా ప్రచారంపై స్పందిస్తూ తెలుగు ఆడియన్స్ జనవరిలో రిలీజ్ చేయమని కోరుతున్నట్లు చెప్పారు. డిసెంబర్లో అయితే హిందీ మార్కెట్కు అనుకూలిస్తుందని అన్నారు. ఈ విషయమై ఆలోచిస్తున్నామన్నారు. కాగా రాజాసాబ్ Dec 5న విడుదలవుతుందని ఇప్పటికే ప్రకటించారు.
News August 6, 2025
భర్త భరణంపై ఆధారపడొద్దు.. విడాకులపై SC తీర్పు

పని చేసే వీలున్న మహిళ భరణం కోసం పాకులాడొద్దని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ముంబైకి చెందిన ఓ మహిళ 18 నెలలకే భర్త నుంచి విడిపోవాలనుకుంది. రూ.12 కోట్లతో పాటు ముంబైలో లగ్జరీ ఫ్లాట్ ఇప్పించాలని కోరింది. సదరు మహిళ ఉన్నత విద్య చదివిందని తెలుసుకున్న కోర్టు.. ‘మీరెందుకు ఉద్యోగం చేయరు? ఇతరులపై ఆధారపడకుండా హుందాగా జీవించవచ్చు కదా’ అని ప్రశ్నించింది. ఫ్లాట్ మాత్రమే భరణంగా వస్తుందని తీర్పు చెప్పింది.