News September 3, 2024

వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వ తక్షణ చర్యలు: మంత్రి

image

వరద బాధితులను ఆదుకునేందుకు ప్రజా ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకుంటుందని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. మరణించిన వ్యక్తుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా రూ.4 నుంచి 5లక్షలు పెంచిందన్నారు. పూర్తిగా దెబ్బతిన్న పంట పొలాలకు ఎకరానికి రూ.10వేల నష్టపరిహారం ఇస్తుందన్నారు. కంటింజెన్సీ ఫండ్ కింద వరద బాధిత ఒక్కో జిల్లాకు రూ.5కోట్లు అని, జిల్లాలో 24/7 పనిచేసేందుకు కమాండ్ కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేస్తామన్నారు.

Similar News

News July 9, 2025

చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్‌కు బంగారు పతకం

image

కరీంనగర్ కమిషనరేట్ కేంద్రంలో నిర్వహించిన రాజన్న జోన్ III స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీల్లో చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్ ప్రతిభ కనబరిచారు. మెడికల్ లీగల్ టెస్ట్‌లో బంగారు పతకం సాధించారు. ఈ సందర్భంగా సీఐ ప్రదీప్ కుమార్‌ను సీపీ గౌస్ ఆలం, అడిషనల్ డీసీపీ వెంకటరమణ, అడిషనల్ డీసీపీ ఏఆర్ భీమ్ రావు, ఏసీపీలు విజయ్ కుమార్, వేణుగోపాల్ అభినందించారు.

News July 8, 2025

ముగిసిన పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు

image

కరీంనగర్‌లో రాజన్న జోన్ III స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ముగిసినట్లు CP గౌస్ ఆలం మంగళవారం తెలిపారు.సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్, యాంటీ సబాటేజ్ చెక్, కంప్యూటర్ అవేర్నెస్ కాంపిటీషన్, డాగ్ స్క్వాడ్ కాంపిటీషన్, పోలీస్ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ వంటి ఆరు విభాగాలలో పోటీలు నిర్వహించారు. విజేతలుగా నిలిచిన వారిని ఎంపిక చేసి వరంగల్‌లో నిర్వహించనున్న పోటీలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు.

News July 8, 2025

పోలీసుల ప్రతిభను గుర్తించడానికే ఈ పోటీలు: KNR సీపీ

image

KNR పోలీస్ కమీషనరేట్ కేంద్రంగా రాజన్న జోన్ III స్థాయి తెలంగాణ స్టేట్ పోలీస్ డ్యూటీ మీట్ పోటీలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పోలీసు వృత్తిలో మరింత నైపుణ్యం, సామర్థ్యం, ప్రతిభ పెంపొందించుకునేందుకు ఈ ‘పోలీసు డ్యూటీ మీట్’ను నిర్వహిస్తున్నట్లు కరీంనగర్ పోలీస్ కమీషనర్ గౌస్ ఆలం ఐపీఎస్ పేర్కొన్నారు. నేర దర్యాప్తులో మరింత శాస్త్రీయత, నైపుణ్యం కనబరిచే విధంగా ఈ పోటీలు జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.