News September 3, 2024
కళ్లను రక్షించే 20-20-20 ఆరోగ్య సూత్రం

సర్వేంద్రియానాం నయనం ప్రధానం. ప్రస్తుతం కంప్యూటర్లు, మొబైళ్లు చూడకుండా క్షణం గడవని పరిస్థితి. స్క్రీన్ టైమ్తో ఒత్తిడి పెరిగి కళ్లు అలసిపోతాయి. దీంతో తలనొప్పి, కంటిచూపు తగ్గడం, పొడిబారడం, ఎరుపెక్కడం, దురద వంటి సమస్యలు వేధిస్తాయి. అందుకే 20-20-20 సూత్రం అనురించాలని వైద్యులు చెబుతున్నారు. 20ని. స్క్రీన్ చూశాక ముఖం తిప్పుకొని 20 ఫీట్ల దూరం 20 సెకన్లు చూస్తే నేత్రాలపై ఒత్తిడి తగ్గుతుందని అంటున్నారు.
Similar News
News September 16, 2025
శుభ సమయం (16-09-2025) మంగళవారం

✒ తిథి: బహుళ దశమి రా.2.51 వరకు
✒ నక్షత్రం: ఆరుద్ర ఉ.10.33 వరకు
✒ శుభ సమయములు: సా.5.10-సా.6.10
✒ రాహుకాలం: మ.3.00-మ.4.30
✒ యమగండం: ఉ.9.30-మ.10.30
✒ దుర్ముహూర్తం: ఉ.8.24-ఉ.9.12, రా.10.48-రా.11.36
✒ వర్జ్యం: రా.10.08-రా.11.38
✒ అమృత ఘడియలు: ఏమీ లేవు
News September 16, 2025
TODAY HEADLINES

* యూరియా వాడకం తగ్గిస్తే బస్తాకు రూ.800 ఇస్తాం: చంద్రబాబు
* కాలేజీల యాజమాన్యాలతో TG ప్రభుత్వం చర్చలు సఫలం
* చొరబాటుదారులపై కఠిన చర్యలు తీసుకుంటాం: PM మోదీ
* మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టాలనుకోవడం దారుణం: జగన్
* బండి సంజయ్పై కేటీఆర్ రూ.10 కోట్ల దావా
* వక్ఫ్ చట్టాన్ని సస్పెండ్ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరణ
* ఆసియా కప్లో సూపర్-4కు దూసుకెళ్లిన టీమిండియా
News September 16, 2025
వక్ఫ్ చట్టంపై SC ఉత్తర్వులను స్వాగతించిన KTR

TG: వక్ఫ్ చట్టంపై సుప్రీంకోర్టు మధ్యంతర <<17717100>>ఉత్తర్వులను<<>> మాజీ మంత్రి KTR స్వాగతించారు. ఈ చట్టంలోని వివాదాస్పద నిబంధనలను BRS మొదటి నుంచి వ్యతిరేకిస్తోందన్నారు. ‘చట్టంలోని సమస్యలపై మేం పోరాడాం. ఒక వ్యక్తి ముస్లిం అని ఎవరు నిర్ణయిస్తారు? ప్రభుత్వ అధికారి ఏకపక్షంగా వక్ఫ్ ఆస్తుల యాజమాన్యాన్ని ఎలా నిర్ణయిస్తారు? ఇలాంటి అనేక సమస్యలు ఈ చట్టంలో ఉన్నాయి. ఇవి విభజన రాజకీయాలకు ఆజ్యం పోయగలవు’ అని ఆయన అన్నారు.