News September 3, 2024
సహాయక చర్యలపై శ్రీకాకుళం ఎంపీ సమీక్ష

విజయవాడలో వరద బాధితులకు చేస్తున్న సహాయక చర్యలపై శ్రీకాకుళం ఎంపీ, కేంద్రమంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, మంత్రి లోకేశ్ NDEF, వైమానికదళాలతో కలిసి చర్చించారు. వరద బాధితులకు ఆహారం, తాగునీరు సరఫరా చేయడంపై పలు సూచనలు చేశారు. డ్రోన్లు, హెలికాప్టర్ల ద్వారా ఆహారం అందజేయాలని సూచించారు.
Similar News
News December 25, 2025
మానవాళి మహోదయానికి క్రీస్తు బోధనలు: రామ్మోహన్ నాయుడు

మానవాళి మహోదయానికి క్రీస్తు బోధనలు ఎంతగానో దోహద పడతాయని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయడు అన్నారు. క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ప్రజలకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ప్రేమని పంచడమే కిస్మస్ సందేశమని అన్నారు. క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, కరుణ, శాంతిని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. క్రిస్మస్ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని, అందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.
News December 25, 2025
సిక్కోలు సిన్నోడు SUPER

ఈ రోజుల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం సాధించాలంటే గగనం.. అలాంటిది శ్రీకాకుళం జిల్లా, పొందూరు మండలం, మజ్జిలిపేట గ్రామానికి చెందిన పైడి.సతీష్ ఎలాంటి కోచింగ్ లేకుండా ఒకే సారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాడు. UPSC లో గ్రూప్-B నర్సింగ్ ఆఫీసర్, AMIIS లో నర్సింగ్ ఆఫీసర్, తెలంగాణలో MHSRB, 51 ర్యాంకుతో నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగాలను సంపాదించాడు. సతీష్ కు గ్రామస్తులు అభినందనలు తెలిపారు.
News December 25, 2025
శ్రీకాకుళం: భక్తిశ్రద్ధలతో క్రిస్మస్ జరుపుకోవాలి: కలెక్టర్

క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లాలోని క్రైస్తవులకు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు సమాజంలో ప్రేమ, కరుణ, శాంతిని పెంపొందిస్తాయని ఆయన పేర్కొన్నారు. ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలన్నారు. అందరూ సుఖసంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు.


