News September 3, 2024

ఎకరాకు రూ.30 వేల పరిహారం ఇవ్వాలి: హరీశ్ రావు

image

TG: ప్రభుత్వం సకాలంలో స్పందించి ఉంటే ఖమ్మంలో వరద నష్టం తగ్గేదని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఇసుకమేటలు పెట్టిన ప్రాంతాల్లో రూ.50వేల పరిహారం ఇవ్వాలన్నారు. రాష్ట్రాన్ని ఆదుకోవడంలో కేంద్రం విఫలమైందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రభుత్వం, ప్రతిపక్షాలు కలిసి వెళ్లి కేంద్రాన్ని నిలదీయాలన్నారు.

Similar News

News November 11, 2025

CSKకి సంజూ శాంసన్ ఎందుకు?

image

సంజూ శాంసన్ CSKలో చేరడం దాదాపు ఖరారైంది. అయితే జడేజాను RRకు పంపి శాంసన్‌ను తీసుకోవడంలో చెన్నై జట్టుకు భవిష్యత్ ప్రయోజనాలున్నాయని క్రీడావర్గాలు చెబుతున్నాయి. ధోనీ తర్వాత సారథిగా సంజూ‌ బెటర్ అని యాజమాన్యం భావించినట్లు పేర్కొంటున్నాయి. కీపింగ్, స్ట్రాంగ్ బ్యాటర్ కోటాను ఫుల్‌ఫిల్ చేస్తారనే ట్రేడ్‌కు చెన్నై ఆసక్తి చూపినట్లు వివరిస్తున్నాయి. గతంలో జడేజాకు CSK కెప్టెన్సీ ఇవ్వగా ఫెయిలైన విషయం తెలిసిందే.

News November 11, 2025

‘రిచా’ పేరిట స్టేడియం

image

WWC విన్నర్ రిచా ఘోష్‌కు అరుదైన గౌరవం దక్కనుంది. స్వరాష్ట్రం వెస్ట్ బెంగాల్‌లో నిర్మించే స్టేడియానికి ఆమె పేరు పెట్టాలని CM మమతా బెనర్జీ నిర్ణయించారు. అక్కడి సిలిగురిలోని 27 ఎకరాల్లో స్టేడియం నిర్మించాలని స్థానిక మేయర్‌కు సూచించినట్లు సీఎం తెలిపారు. స్టేడియానికి రిచా పేరు పెడితే భవిష్యత్ తరాలకు ప్రేరణగా ఉంటుందని చెప్పారు. కాగా ఇటీవల రిచాను ప.బెంగాల్ ప్రభుత్వం DSPగా నియమించిన విషయం తెలిసిందే.

News November 11, 2025

‘SIR’పై నేటి నుంచి సుప్రీంలో విచారణ

image

దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితా ప్రత్యేక సవరణ(SIR)ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై SCలో నేటి నుంచి విచారణ జరగనుంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం వాదనలు విననుంది. అయితే కొత్తగా దాఖలయ్యే పిటిషన్లు ఏమైనా ఉంటే చీఫ్ జస్టిస్ గవాయ్ సమక్షంలో ప్రవేశపెట్టాలని ధర్మాసనం సూచించింది. SIRను వ్యతిరేకిస్తూ బెంగాల్ కాంగ్రెస్‌తో పాటు ADR స్వచ్ఛంద సంస్థ పిటిషన్లు వేశాయి.