News September 3, 2024

వరద బాధితులకు పవన్ రూ.కోటి విరాళం

image

AP: వరద బాధితులకు dy.CM పవన్ కళ్యాణ్ రూ.కోటి విరాళం ప్రకటించారు. వరద తీవ్రత, సహాయక చర్యలపై ఆయన రాష్ట్ర విపత్తుల కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ‘గత ప్రభుత్వం ప్రాజెక్టుల పట్ల నిర్లక్ష్యం వహించింది. అందుకే ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఆర్మీ సహకారంతో బాధితులకు సాయం అందిస్తున్నాం. బుడమేరు నిర్వహణ సక్రమంగా లేక వరద పోటెత్తింది. మరికొంత వరద వచ్చుంటే పెను ప్రమాదం జరిగి ఉండేది’ అని ఆయన పేర్కొన్నారు.

Similar News

News September 19, 2025

24న అంబేడ్కర్ వర్సిటీ MBA అడ్మిషన్స్ కౌన్సెలింగ్

image

TG: HYD అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను MBA(హాస్పిటల్ హెల్త్ కేర్ మేనేజ్మెంట్) అడ్మిషన్ షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 24న ఉదయం 9 గంటలకు CSTD బిల్డింగ్‌లో కౌన్సెలింగ్ ఉంటుందని విద్యార్థి సేవల విభాగం డైరెక్టర్ డా.వై.వెంకటేశ్వర్లు తెలిపారు. ఐసెట్ లేదా వర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్‌లో పాసైనవారే అప్లై చేసుకోవాలని సూచించారు. మరిన్ని వివరాలకు www.braouonline.in సంప్రదించాలన్నారు.

News September 19, 2025

తొలి రుతుక్రమంపై ప్రభావం చూపుతున్న వాతావరణ మార్పులు

image

వాతావరణ మార్పులతో తొలి రుతుక్రమం ప్రభావితం అవుతున్నట్లు తాజా అధ్యయనం వెల్లడించింది. బంగ్లాదేశ్‌కు చెందిన పరిశోధకులు 1992-93, 2019-21 సంవత్సరాల్లో జనాభా, ఆరోగ్య సర్వేల సమాచారం, నాసా వాతావరణ డేటాను విశ్లేషించి ఈ విషయాన్ని వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రతలు శరీరంలో ఒత్తిడిని పెంచి, హార్మోన్లను ప్రభావితం చేస్తున్నాయి. తద్వారా ఉష్ణప్రాంతాల్లోని బాలికల్లో రుతుక్రమం ఆలస్యమవుతున్నట్లు గుర్తించారు.

News September 19, 2025

సాయుధ పోరాటం ఆపబోం: మావోయిస్టులు

image

తమ సాయుధ పోరాటాన్ని ఆపబోమని మావోయిస్టులు లేఖ రిలీజ్ చేశారు. ‘ఆపరేషన్ కగార్ ఆపితే ఆయుధాలు వదిలేస్తాం, కాల్పుల విరమణ పాటిస్తాం’ అని ఇటీవల అభయ్(సోనూ) పేరుతో లేఖ వచ్చిన విషయం తెలిసిందే. ఇది ఆయన వ్యక్తిగతమంటూ మావోల అధికార ప్రతినిధి జగన్ పేరిట లేఖ విడుదలైంది. సాయుధ పోరాటాన్ని విరమిస్తున్నానని సోనూ ఎందుకు ప్రకటించాడో అర్థం కావట్లేదన్నారు. ఇటువంటి పద్ధతులు ఉద్యమానికి నష్టం చేస్తాయని పేర్కొన్నారు.