News September 3, 2024

తుంగభద్ర ప్రాజెక్టు దిగువ ప్రజలకు వరద హెచ్చరికలు

image

కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు దిగువ ప్రజలకు అధికారులు వరద హెచ్చరికలు జారీ చేశారు. ఎగువ నుంచి భారీగా నీరు వచ్చి చేరుతున్నట్లు అధికారులు తెలిపారు. రేపు ఉదయం డ్యామ్ నుంచి 50 వేల క్కూసెక్కులకు పైగా నీటిని కిందికి రిలీజ్ చేస్తామన్నారు. దీంతో పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అలర్ట్ చేశారు.

Similar News

News January 21, 2026

పండ్ల తోటల్లో కలుపు నివారణ మార్గాలు

image

పండ్ల తోటల తొలిదశలో అంతర పంటలతో కలుపు తగ్గించవచ్చు. పండ్ల కోత తర్వాత ముందుగా తోటంతా అడ్డంగా, నిలువుగా దున్నాలి. కలుపు మొక్కలు పెరిగితే రోటావేటర్ తోటలోకి వెళ్లడానికి వీలుగా ఏపుగా పెరిగిన కొమ్మలను తీసేసి ఒకసారి తోటంతా శుభ్రం చేస్తే నెలరోజులపాటు కలుపును నివారించవచ్చు. తోటను శుభ్రం చేసిన వెంటనే భూమిలో తగినంత తేమ ఉన్నప్పుడు 1-1.5 లీటర్ల పెండిమిథాలిన్‌ను 5 కిలోల ఇసుకలో కలిపి తోటంతా సమానంగా వెదజల్లాలి.

News January 21, 2026

APPLY NOW: సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడులో ఉద్యోగాలు

image

సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ తమిళనాడు(<>CUTN<<>>)లో 13 నాన్ టీచింగ్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి టెన్త్, ఐటీఐ, డిగ్రీ, బీఈ/బీటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, M.LSc ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://cutn.ac.in/

News January 21, 2026

మొబైల్ లేకున్నా వాట్సాప్‌ వాయిస్, వీడియో కాల్స్!

image

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వెబ్ యూజర్ల కోసం కొత్త ఫీచర్ అందుబాటులోకి తేనుంది. దీంతో మొబైల్ లేకపోయినా వాయిస్, వీడియో కాల్స్ మాట్లాడుకోవచ్చు. గ్రూప్ కాల్‌లో 32 మంది మాత్రమే కనెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కంప్యూటర్/ల్యాప్‌టాప్‌లో ఏ అప్లికేషన్లు ఇన్‌స్టాల్ చేసుకోకుండానే కాల్స్‌లో కనెక్ట్ కావచ్చు. వాట్సాప్‌ వెబ్ యూజర్లకు 2 వారాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తుందని తెలుస్తోంది.