News September 4, 2024

గుంటూరు: ఏపీ అలర్ట్‌తో 7.49 కోట్ల మందికి హెచ్చరిక

image

రాష్ట్రంలో భారీ వర్షాలు వరదల సమయంలో ఏపీ అలెర్ట్ ద్వారా 7.49 కోట్ల మంది వినియోగదారులకు హెచ్చరిక సందేశాలు అందించామని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. మంగళవారం రాత్రి ఓ ప్రకటన విడుదల చేసింది. 149 పశువులు 59,848 కోళ్లు మరణించాయన్నారు. 12 విద్యుత్ సబ్స్టేషన్లు దెబ్బతిన్నాయని, అధిక వర్షాల కారణంగా 2851 కిలోమీటర్ల పొడవున ఆర్‌అండ్‌బి రోడ్లు దెబ్బతిన్నాయని పేర్కొంది.

Similar News

News July 6, 2025

తెనాలి: టెలిగ్రామ్ యూజర్లకు డీఎస్పీ జనార్ధనరావు హెచ్చరిక

image

వాట్సాప్, టెలిగ్రామ్ యూజర్లు అప్రమత్తంగా ఉండాలని తెనాలి డీఎస్పీ జనార్ధనరావు సూచించారు. ‘apk’ ఫైల్స్, ప్రభుత్వ అధికారుల గ్రూపుల్లో చేరమంటూ వచ్చే సందేశాలను నమ్మవద్దని కోరారు. వీటిని డౌన్‌లోడ్ చేస్తే ఫోన్ నేరగాళ్ల వశమై, యాప్‌ల నుంచి నగదు తస్కరిస్తారని హెచ్చరించారు. మీ స్నేహితులకు మీ తరఫున మెసేజ్‌లు పంపి ఫోన్‌ను హ్యాక్ చేస్తారని తెలిపారు.

News July 6, 2025

గుంటూరు: లోక్ అదాలత్‌లో 10,698 కేసులు పరిష్కారం

image

గుంటూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా వివిధ న్యాయస్థానాల్లో పెండింగ్‌లో ఉన్న రాజీ సాధ్యమైన కేసులను పరిష్కరించారు. వాటిలో సివిల్‌ కేసులు 1,041, క్రిమినల్‌ 9,580, ప్రీలిటిగేషన్‌ 77, మొత్తం 10,698 కేసులు ఉన్నాయి. పరిష్కరించిన కేసుల విలువ మొత్తం రూ.50.96 కోట్లు ఉందని జడ్జి చక్రవర్తి తెలిపారు.

News July 5, 2025

గుంటూరు: కానిస్టేబుల్ కుటుంబానికి సహాయం

image

గుంటూరు జిల్లా 2012 బ్యాచ్ ఏఆర్ కానిస్టేబుళ్లు రూ.1.35 లక్షల ఆర్థిక సహాయం అందించారు. ఈ మొత్తాన్ని ఎస్పీ సతీశ్ కుమార్ చేతుల మీదుగా కుటుంబ సభ్యులకు తండ్రికి రూ.35 వేలు, సతీమణికి రూ.లక్ష అందజేశారు. రోడ్డు ప్రమాదంలో మరణించిన కానిస్టేబుల్ క్రాంతి కుమార్ 2012 బ్యాచ్ సేవా, ఐక్యమత్యాన్ని ఎస్పీ ప్రశంసించారు. పోలీస్ శాఖ తరఫున కుటుంబానికి అన్ని ప్రయోజనాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామన్నారు.