News September 4, 2024

NK: వరద బాధితుల్ని కాపాడని అధికారులకు ఉరిశిక్ష!

image

ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్‌ఉన్ 20-30 మంది అధికారులకు ఉరిశిక్ష విధించారని ద.కొరియా మీడియా వెల్లడించింది. చైనా సమీపంలోని చాంగాంగ్ ప్రావిన్స్‌ వరదల్లో ప్రజలు చనిపోకుండా వారు కాపాడలేకపోవడమే ఇందుకు కారణం. జులైలో సంభవించిన ఈ విపత్తులో 1000+ మంది చనిపోయారు. వందల సంఖ్యలో ఇళ్లు, 7410 ఎకరాల వ్యవసాయభూమి, రోడ్లు, కట్టడాలు నీట మునిగాయని సమాచారం.

Similar News

News February 16, 2026

ఎమోషన్స్‌ను బయటపెట్టాల్సిందే..

image

ప్రతిమనిషికీ భావోద్వేగాలు ఉంటాయి. పరిస్థితులను బట్టి అవి బయటకు వస్తాయి. కానీ కొందరు కోపం, భయం, బాధ వస్తే లోలోపలే తొక్కిపెట్టేస్తుంటారు. అవి తలనొప్పి, కడుపు సమస్యలు, గుండెదడ, నిద్రలేమి, అజీర్తి వంటి శారీరక సమస్యల రూపంలో అవి బయటకు వస్తాయంటున్నారు సైకాలజిస్ట్ విశేష్. కాబట్టి ప్రతిఒక్కరూ తమలోని ఎమోషన్స్‌ని సన్నిహితులతో పంచుకోవాలని సూచిస్తున్నారు. కుదరకపోతే సైకాలజిస్ట్ సాయం తీసుకోవాలని చెబుతున్నారు.

News February 16, 2026

విజయ్- రష్మిక పెళ్లికార్డు వైరల్!

image

రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక వివాహం ఈనెల 26న జరగనున్నట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఆహ్వాన పత్రిక ఒకటి వైరలవుతోంది. మార్చి 4న 7PMకి హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణలో రిసెప్షన్ జరగనుందని అందులో పేర్కొన్నారు. పెళ్లిని బంధువుల సమక్షంలో చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. దీనిపై VD టీమ్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది.

News February 16, 2026

టెక్నాలజీతో పౌర సేవకు బిల్‌గేట్సే ప్రేరణ: సీఎం

image

AP: రాష్ట్రంలోని ప్రజల జీవితాలను రియల్ టైమ్ గవర్నెన్స్ సిస్టమ్(RTGS) మారుస్తోందని సీఎం చంద్రబాబు తెలిపారు. టెక్నాలజీ మానవాళికి ఉపయోగపడాలన్నారు. 1990లలో బిల్‌గేట్స్‌తో మీటింగ్ తర్వాత సాంకేతికత ద్వారా పౌర సేవకు ప్రేరణ కలిగిందని Xలో గుర్తు చేసుకున్నారు. విద్య, ఆరోగ్యం, వ్యవసాయంతో సహా అనేక కార్యక్రమాలతోపాటు యంగ్ మైండ్స్‌తో నిండిఉన్న RTGS కేంద్రాన్ని బిల్ గేట్స్ సందర్శించడం సంతోషంగా ఉందని చెప్పారు.