News September 4, 2024
టీడీపీ ఆఫీసుపై దాడి కేసు.. వైసీపీ నేతల బెయిల్ పిటిషన్లు కొట్టివేత

AP: టీడీపీ ఆఫీసు, చంద్రబాబు ఇంటిపై దాడి కేసులో YCP నేతలకు ముందస్తు బెయిల్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. TDP ఆఫీసుపై దాడి కేసులో అప్పిరెడ్డి, అవినాశ్, తలశిల రఘురాం, నందిగామ సురేశ్, జోగి రమేశ్, CBN నివాసంపై దాడి కేసులో జోగి రమేశ్ నిందితులుగా ఉన్నారు. సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకునేంత వరకు అరెస్టు నుంచి మినహాయించాలని వైసీపీ తరఫు న్యాయవాదులు కోరగా మధ్యాహ్నం నిర్ణయాన్ని వెల్లడించనుంది.
Similar News
News December 27, 2025
వింటర్లో ఇలా చేస్తే ఇమ్యూనిటీ పెరుగుతుంది!

చలికాలంలో సీజనల్ వ్యాధులు రాకుండా ఉండేందుకు, ఇమ్యూనిటీ పెరిగేందుకు వైద్యులు కొన్ని సలహాలిస్తున్నారు. ‘లేవగానే ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లు తాగండి. ఉదయం కాసేపు ఎండలో ఉండండి. వాకింగ్ లేదా రన్నింగ్ చేయాలి. స్లో బ్రీతింగ్ ప్రాక్టీస్ చేయండి. ప్రొటీన్+హెల్తీ ఫ్యాట్స్ ఉండేలా బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకోండి. కోల్డ్ వాటర్, ఖాళీ కడుపుతో కాఫీ తాగడం, లేవగానే హడావుడిగా పనులు చేయడం మానుకోండి’ అని చెబుతున్నారు.
News December 27, 2025
కొత్త సంవత్సరం వచ్చేస్తుంది.. ఈ పనులు చేయాలట!

2026లో లక్ష్మీదేవి అనుగ్రహం కోసం కొన్ని పరిహారాలు పాటిస్తే విశేష ఫలితాలుంటాయని పండితులు చెబుతున్నారు. ‘ఉదయాన్నే లేచి సూర్యుడికి అర్ఘ్యం సమర్పించి, ఇంటిముందు ముగ్గులు వేసి తులసి కోటను పూజించాలి. తులసి మొక్కకు ఎరుపు దారం కట్టి విష్ణు మంత్రాలు జపించాలి. ఇది ఆర్థిక శ్రేయస్సును కలిగిస్తుంది. ఇష్టదైవానికి నైవేద్యం పెట్టి, ఆవుకు గ్రాసం తినిపించాలి. ఇలా చేస్తే కుటుంబంలో ఆనందం నెలకొంటుంది’ అంటున్నారు.
News December 27, 2025
తల్లిదండ్రులు ఈ పొరపాట్లు చెయ్యొద్దు

తల్లిదండ్రులు చేసే కొన్ని పొరపాట్ల వల్లే పిల్లలకు మాటలు లేట్గా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. పిల్లలకు ఆరునెలలు రాగానే ఘనపదార్థాలు నెమ్మదిగా అలవాటు చెయ్యాలి. అప్పుడే నాలుకకు వ్యాయామం అందుతుందంటున్నారు. అలాగే సిప్పీ కప్పుల వాడకం తగ్గించాలి. దీనివల్ల కూడా మాటలు ఆలస్యమవుతాయని చెబుతున్నారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మాటలు రాకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.


