News September 4, 2024

గ్రేట్: 185మంది పేదపిల్లలకు అతడు అండాదండ..!

image

ఢిల్లీకి చెందిన అమిత్ లాథియా ఓ సాదాసీదా కానిస్టేబుల్‌. అయితేనేం.. 12 ఏళ్లుగా ప్రతి నెలా తన జీతం వెచ్చించి నిరుపేద పిల్లలకు అండగా నిలుస్తున్నారు. పనులు చేసుకునే 185మంది పిల్లలు ఆయన చలవతో నేడు వివిధ ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. పేద విద్యార్థులను గుర్తించడం, ఉచితంగా ఆహారం, నివాసం, స్టడీ మెటీరియల్స్ అందించి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడం.. ఇదే అమిత్ పని. తన భార్య కూడా ఈ విషయంలో ఆయనకు అండగా ఉన్నారు.

Similar News

News February 3, 2025

17% పెరిగిన జీఎస్టీ ఆదాయం

image

తెలంగాణలో జీఎస్టీ, వ్యాట్ రాబడులు పెరిగాయి. జనవరిలో ఏకంగా 17 శాతం జీఎస్టీ ఆదాయం పెరిగింది. 2024 జనవరిలో రూ.3351.88 కోట్ల జీఎస్టీ వసూలు కాగా, ఈ ఏడాది JANలో రూ.3921.68 కోట్లు వచ్చాయి. గత 10 నెలల్లో జీఎస్టీ, వ్యాట్ కింద రూ.62858.55 కోట్లు వసూలు అయ్యాయి.

News February 3, 2025

APకి రూ.9,417కోట్లు, TGకు రూ.5,337 కోట్లు: అశ్వినీ వైష్ణవ్

image

రైల్వే బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాల కేటాయింపులపై కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ వివరించారు. ‘తెలంగాణకు రూ.5,337cr, APకి రికార్డు స్థాయిలో రూ.9,417cr కేటాయించాం. తెలంగాణ వ్యాప్తంగా 1,326KM కవచ్ టెక్నాలజీ పని చేస్తోంది. APకి UPA హయాంలో కంటే 11రెట్లు ఎక్కువ కేటాయించాం. APలో 73రైల్వే‌స్టేషన్ల అభివృద్ధికి నిధులిచ్చి రూపురేఖలు మారుస్తున్నాం. రూ.8,455cr విలువైన రైల్వే ప్రాజెక్టులు మంజూరు చేశాం’ అని అన్నారు.

News February 3, 2025

తండ్రిని రెండు ముక్కలు చేయాలనుకున్నారు!

image

తండ్రికి అంత్యక్రియలు చేసేందుకు ఆ ఇద్దరు కొడుకులు పోటీ పడ్డారు. ఈక్రమంలో మృతదేహాన్ని గంటల తరబడి ఇంటి బయటే వదిలేశారు. చివరికి శవాన్ని 2 ముక్కలు చేసి చెరో ముక్కకు ఇద్దరు అంత్యక్రియలు చేయాలన్న నిర్ణయానికొచ్చారు. ఆ నిర్ణయం విని హడలిపోయిన స్థానికులు పోలీసులకు విషయాన్ని చేరవేశారు. పోలీసులు పెద్ద కొడుక్కి కర్మకాండ బాధ్యతల్ని అప్పగించారు. MPలోని టీకమ్‌ గఢ్ జిల్లా తాల్ లిధోరా గ్రామంలో ఈ ఘటన జరిగింది.