News September 4, 2024

విశాఖ జిల్లా నుంచి 68వేల ఫుడ్ ప్యాకెట్స్

image

వరద బాధితుల కోసం విశాఖ జిల్లా అధికార యంత్రాంగం 71,500 అల్పాహారం ప్యాకెట్లు, 68 వేల భోజనం ప్యాకెట్లు, 80,000 వాటర్ బాటిళ్లతో పాటు 48,500 రాత్రి భోజనం ప్యాకెట్లు సమకూర్చింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఫుడ్ ప్యాకెట్లతో పాటు బిస్కెట్లు, రొట్టెలు, కొవ్వొత్తులు సిద్ధం చేసి ప్రత్యేక వాహనాల ద్వారా విజయవాడ పంపించారు. ఈ ప్రక్రియను డీఆర్ఓ మోహన్ కుమార్ పర్యవేక్షించారు.

Similar News

News January 9, 2026

ఏపీ ఆంధ్ర బాలికల క్రికెట్ జట్టుకు ప్రత్యేక శిక్షణ

image

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అంధ బాలికల క్రికెట్ జట్టు ప్రత్యేక శిక్షణ పొందుతోంది. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జాతీయస్థాయి ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. వీటికి ఏపీ నుంచి ఈ టీంమ్ పాల్గొంటుందని విభిన్న ప్రతిభవంతుల సహాయ సంచాలకులు సవిత తెలిపారు. క్రీడాకారిణులకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఆమె చెప్పారు.

News January 9, 2026

ఏపీ ఆంధ్ర బాలికల క్రికెట్ జట్టుకు ప్రత్యేక శిక్షణ

image

పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో ఆంధ్రప్రదేశ్ అంధ బాలికల క్రికెట్ జట్టు ప్రత్యేక శిక్షణ పొందుతోంది. ఈనెల 16 నుంచి 22వ తేదీ వరకు ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్‌లో జాతీయస్థాయి ఉమెన్స్ బ్లైండ్ క్రికెట్ పోటీలు జరగనున్నాయి. వీటికి ఏపీ నుంచి ఈ టీంమ్ పాల్గొంటుందని విభిన్న ప్రతిభవంతుల సహాయ సంచాలకులు సవిత తెలిపారు. క్రీడాకారిణులకు కావలసిన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని ఆమె చెప్పారు.

News January 8, 2026

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో కార్మికుడి మృతి

image

విశాఖ స్టీల్ ప్లాంట్‌‌లో ఓ కార్మికుడు మృతి చెందాడు. అజీమాబాద్‌కు చెందిన మహమ్మద్ సుబాన్ (41) ప్లాంట్‌లోని ఫ్రెండ్స్ ఎంటర్‌ప్రైజెస్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గురువారం సెంటర్ ప్లాంట్ విభాగంలో పనులు ముగించుకుని కిందకు దిగుతుండగా ప్రమాదవశాత్తు జారి పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై స్టీల్ ప్లాంట్ పోలీసులు కేసు నమోదు చేశారు.