News September 4, 2024

విశాఖ జిల్లా నుంచి 68వేల ఫుడ్ ప్యాకెట్స్

image

వరద బాధితుల కోసం విశాఖ జిల్లా అధికార యంత్రాంగం 71,500 అల్పాహారం ప్యాకెట్లు, 68 వేల భోజనం ప్యాకెట్లు, 80,000 వాటర్ బాటిళ్లతో పాటు 48,500 రాత్రి భోజనం ప్యాకెట్లు సమకూర్చింది. వివిధ స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో ఫుడ్ ప్యాకెట్లతో పాటు బిస్కెట్లు, రొట్టెలు, కొవ్వొత్తులు సిద్ధం చేసి ప్రత్యేక వాహనాల ద్వారా విజయవాడ పంపించారు. ఈ ప్రక్రియను డీఆర్ఓ మోహన్ కుమార్ పర్యవేక్షించారు.

Similar News

News January 7, 2026

9,10 తేదీల్లో విశాఖ‌లో లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0

image

విశాఖ వైభ‌వాన్ని మ‌రింత చాటిచెప్పేలా పోర్ట్స్, ఓడరేవుల శాఖ ఆధ్వర్యంలో ఈనెల 9, 10వ తేదీల్లో MGM పార్కులో లైట్ హౌస్ ఫెస్టివల్ 3.0 నిర్వ‌హించ‌నున్న‌ట్లు JC మయూర్ అశోక్ బుధవారం తెలిపారు. ఫెస్టివల్‌లో భాగంగా ప్రతిరోజూ సాయంత్రం 6 నుంచి సాంస్కృతిక ప్ర‌ద‌ర్శ‌న‌లు, ఇత‌ర కార్యక్రమాలు ఉంటాయ‌న్నారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు, కేంద్ర టూరిజం మంత్రి సురేశ్ గోపి ఈ కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు.

News January 7, 2026

తప్పుడు రాతలు రాసే పోరాటం చేస్తా: మంత్రి లోకేశ్

image

తనను కించపరిచే విధంగా ఆర్టికల్ వేశారని ఆరోజు తను విశాఖలోనే లేనట్లు మంత్రి నారా లోకేశ్ పేర్కొన్నారు. 6 సంవత్సరాలుగా ఈ కేసుపై పోరాడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. తను విశాఖ వచ్చినప్పుడు ప్రభుత్వ వాహనాలు వాడటం లేదని, పార్టీ కార్యాలయంలోనే బస చేస్తున్నట్లు చెప్పారు. వార్తలు రాసే ముందు క్లారిటీ తీసుకోవాలని.. తప్పుడు రాతలపై తాను ఎప్పుడూ పోరాడుతునే ఉంటానని మంత్రి లోకేశ్ స్పష్టం చేశారు.

News January 7, 2026

ఏయూలో బయో ఇంక్యుబేషన్ సెంటర్ ఏర్పాటు

image

భారత ప్రభుత్వ డిపార్ట్‌మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (DBT)కి చెందిన బిరాక్ (BIRAC) స‌హ‌కారంతో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బ‌యో నెస్ట్‌ (Bio NEST) బయో ఇంక్యుబేష‌న్‌ సెంటర్ ఏర్పాటుకు అమోదం ల‌భించింది. 3 సంవత్సరాల కాలానికి మొత్తం రూ.5 కోట్లతో చేపట్టిన ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్ట్ శ‌తాబ్ధి వేడుక‌లు జ‌రుపుకుంటున్న త‌రుణంలో ఆంధ్ర‌విశ్వ‌విద్యాల‌యం కిరీటంలో మరొక క‌లికితురాయిగా నిల‌వ‌నుందని రిజిస్ట్రార్ తెలిపారు.