News September 4, 2024
రాయచోటి: కిడ్నాప్ కేసులో నలుగురు ముద్దాయిలు అరెస్ట్

రాయచోటి పట్టణం కొత్తపేట- రామాపురానికి చెందిన కరాటే రామచంద్ర రైస్ పుల్లింగ్ మిషన్ నిర్వహిస్తున్నాడు. అయితే అధిక డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో రామచంద్ర కుటుంబ సభ్యులను బెంగళూరుకు చెందిన నవీన్ మనుషులు కిడ్నాప్ చేసిన కేసులో 9 మందిపై కేసు నమోదు చేసినట్లు రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్ తెలిపారు. వారిలో నలుగురిని అరెస్టు చేసి రిమాండ్కు పంపినట్లు తెలిపారు. ఆగస్టు 31న సంబేపల్లిలో కిడ్నాప్ జరిగినట్లు సమాచారం.
Similar News
News January 10, 2026
గండికోటలో మొదటిరోజు షెడ్యూల్ ఇదే.!

గండికోటలో 11వ తేదీ మొదటిరోజు కార్యక్రమాలు ఇలా ఉన్నాయి.
*సాయంత్రం 4:00 -5:30 గం.వరకు శోభాయాత్ర
*5:30 గం.లకు గండికోట ఉత్సవాలు
*6:30 -7:00 గంలకు జొన్నవిత్తుల గేయాలాపన
*రాత్రి 7:10 – 7.20 గం. వరకు గండికోట థీమ్ డాన్స్
*రాత్రి 7:20 -7:35 గం. వరకు- థిల్లానా కూచిపూడి నృత్యం
*రాత్రి 7:55 – 8:15 గం. వరకు- సౌండ్ & లేజర్ లైట్ షో
*రాత్రి 8:15 – 9:45 గం.వరకు – మంగ్లీచే సంగీత కచేరీ
News January 10, 2026
గండికోట ఉత్సవాలకు ప్రత్యేక బస్సులు

గండికోట ఉత్సవాలు జరుగుతున్న సందర్భంగా ఈనెల 11, 12, 13న ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు RTC రీజనల్ మేనేజర్ గోపాల్రెడ్డి శనివారం తెలిపారు. జమ్మలమడుగు, కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు డిపోల నుంచి మొత్తం 39 బస్సులను నడుపుతున్నామన్నారు. జమ్మలమడుగు నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. ఉదయం నుంచి రాత్రి 10 వరకు బస్సులు తిరుగుతాయన్నారు. ఈ సేవలను ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు.
News January 10, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు..!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540


