News September 4, 2024
అటవీ ప్రాంతాన్ని, వన్య ప్రాణులను కాపాడాలి: కలెక్టర్

కడప జిల్లాలోని అటవీ ప్రాంతాలను, వన్య ప్రాణులను సంరక్షించాలని సంబంధిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అటవీ శాఖ, డిస్టిక్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ కమిటీ మీటింగ్ జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. జిల్లాలోని అటవీ ప్రాంతాలలో టూరిజం స్పాట్లను గుర్తించి అభివృద్ధి చేయాలని తెలిపారు. ఆయా టూరిజం స్పాట్లలో పర్యాటకులు సందర్శించే విధంగా అన్ని ఏర్పాట్లు చేయాలని చెప్పారు.
Similar News
News February 2, 2026
కడప జిల్లాలో AMCల ఆదాయం రూ.10.22 కోట్లు

జిల్లాలో ఈ ఆర్థిక సంవత్సరంలో జనవరి 31 నాటికి AMCలు రూ.10.22 కోట్లు ఆదాయాన్ని ఆర్జించాయి. కడప-రూ.1.86 కోట్లు, ప్రొద్దుటూరు-రూ.1.20 కోట్లు, బద్వేల్-రూ.1.50 కోట్లు, మైదుకూరు-రూ.1.89 కోట్లు, జమ్మలమడుగు-రూ.69.15 లక్షలు, పులివెందుల-రూ.90.70 లక్షలు, రాజంపేట-రూ.53.25 లక్షలు, కమలాపురం-రూ.77.90 లక్షలు, సిద్దవటం-రూ.14.23 లక్షలు, ఎర్రగుంట్ల-రూ.52.71 లక్షలు, సింహాద్రిపురం-రూ.16.91 లక్షలు ఆదాయాన్ని ఆర్జించాయి.
News February 2, 2026
మైదుకూరుకు చేరుకున్న బండ్ల గణేశ్ పాదయాత్ర

సినీ నిర్మాత బండ్ల గణేశ్ చేపట్టిన తిరుమల పాదయాత్ర సోమవారం మైదుకూరుకు చేరుకుంది. ఈయన హైదరాబాద్ నుంచి పాదయాత్ర ప్రారంభించారు. ఆయన చేపట్టిన పాదయాత్రకు మైదుకూరుకు చెందిన టీడీపీ నాయకులు సంఘీభావం ప్రకటించారు. ఇప్పటికీ 350 కిలోమీటర్ల పాదయాత్ర ప్రారంభమైందని గణేశ్ తెలిపారు. సీఎం చంద్రబాబు కోసం ఈ పాదయాత్ర చేపట్టానన్నారు. వచ్చే సోమవారం నాటికి తిరుమలకు చేరుకుంటానన్నారు.
News February 2, 2026
కడప: కానిస్టేబుల్పై కుక్క దాడి

కలసపాడులో కుక్కలు అధికంగా ఉండడంతో స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో ఆదివారం రాత్రి విధి నిర్వహణలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ను కుక్క కరవడంతో ఆయన గాయపడ్డారు. ప్రతి రోజు ఇలా జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. మరి మీ ప్రాంతంలో కుక్కల బెడద ఎలా ఉంది? కామెంట్.


