News September 5, 2024
త్వరలో నామినేటెడ్ పోస్టుల భర్తీ.. వీరికి కీలక పదవులు?

TG: ఇప్పటికే 35 ప్రభుత్వ సంస్థల కార్పొరేషన్లకు ఛైర్మన్లను నియమించిన ప్రభుత్వం మిగిలిన వాటిపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. ఇందులో BRS నుంచి కాంగ్రెస్లో చేరిన ఓ ముగ్గురు MLAలకు RTC, సివిల్ సప్లై, మూసీ రివర్ ఫ్రంట్ వంటి వాటిని ఇవ్వనున్నట్లు సమాచారం. అలాగే విద్య కమిషన్కు ఆకునూరి మురళి, BC కమిషన్కు నిరంజన్, రైతు కమిషన్కు కోదండరెడ్డి పేర్లు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.
Similar News
News January 1, 2026
ఇతిహాసాలు క్విజ్ – 114 సమాధానం

ఈరోజు ప్రశ్న: రావణుడి సోదరి ఎవరు? ఆమె భర్త పేరేంటి? ఆయనను ఎవరు చంపేశారు?
సమాధానం: రావణుడి సోదరి శూర్పణఖ. ఆమె భర్త పేరు విద్యుజ్జిహ్వుడు. అతను రావణుడికి వ్యతిరేకంగా యుద్ధం చేయడంతో, ఆగ్రహించిన రావణుడు సొంత బావ అని చూడకుండా సంహరించాడు. భర్తను కోల్పోయిన బాధ వల్లే శూర్పణఖ తిరుగుతూ అరణ్యంలో రాముడిని చూసి మోహించింది.
<<-se>>#Ithihasaluquiz<<>>
News January 1, 2026
డ్రంకెన్ డ్రైవ్లో ఎంతమంది పట్టుబడ్డారంటే?

ఎంత చెప్పినా ఈసారి కూడా మందుబాబులు మారలేదు. న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ వ్యాప్తంగా 2,731 డ్రంకెన్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి. వీటిలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,198, సైబరాబాద్లో 928, ఫ్యూచర్ సిటీలో 605 మంది తాగి వాహనం నడుపుతూ పట్టుబడ్డట్లు పోలీసులు తెలిపారు. వారందరిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి తనిఖీలు రెగ్యులర్గానూ కొనసాగుతాయని స్పష్టం చేశారు.
News January 1, 2026
రో-కో లేకపోతే వన్డేలు కష్టమే.. అశ్విన్ షాకింగ్ కామెంట్స్

ప్రస్తుతం వన్డే క్రికెట్ పరిస్థితిపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2027 ప్రపంచ కప్ తర్వాత వన్డే ఫార్మాట్ మనుగడ సాగించడం కష్టమని అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కోహ్లీ, రోహిత్ వంటి దిగ్గజాలు రిటైరైతే ఈ ఫార్మాట్ను చూసేవారు తగ్గిపోతారని ఆందోళన వ్యక్తం చేశారు. T20లకు హవా పెరగడం, టెస్ట్లకు ఉన్న క్రేజ్ దృష్ట్యా ODIలకు ఆదరణ తగ్గుతుందని అంచనా వేశారు.


