News September 5, 2024

చిత్తూరు: వివాహేతర బంధానికి ముగ్గురు బలి

image

ఓ చిన్న తప్పుతో ముగ్గురు చనిపోయారు. శాంతిపురం(M) శిలామాకులరాయికి చెందిన రామచంద్ర(45)కు ఇద్దరు పిల్లలు ఉన్నారు. బెంగళూరులో ట్రాన్స్‌పోర్టు బిజినెస్ చేసే అతనికి హిందూపురానికి చెందిన గిరీశ్ పరిచయమయ్యాడు. ఈక్రమంలో గిరీశ్ భార్య శోభతో రామచంద్రకు వివాహేతర సంబంధం ఏర్పడింది. తల్లి పురెమ్మ(68) చాలాసార్లు చెప్పినా రామచంద్ర మారకపోవడంతో సోమవారం ఆత్మహత్య చేసుకోగా.. రామచంద్ర, శోభ బుధవారం <<14020063>>సూసైడ్ <<>>చేసుకున్నారు.

Similar News

News December 29, 2025

తిరుమల: 365 రోజులు.. 450 ఉత్సవాలు

image

ఏడాదికి 365 రోజులే. కానీ కోరిన కోర్కెలు తీర్చే తిరుమల కోనేటి రాయుడికి ఏడాదిలో 450పైగా ఉత్సవాలు జరుగుతాయి. సుప్రభాతం, తోమాల, సహస్రనామార్చన, అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, పూలంగి, శుక్రవారాభిషేకం, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం నక్షత్రోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, పద్మావతి పరిణయం తదితర ఉత్సవాలు చేస్తారు. ఇలా రోజూ ఒక పండగగా నిత్య కళ్యాణం పచ్చ తోరణంలా తిరుమల విరాజిల్లుతోంది.

News December 29, 2025

26 మండలాలకు తగ్గనున్న చిత్తూరు జిల్లా

image

కొత్త చిత్తూరు జిల్లా 32 నుంచి 26 మండలాలకు పరిమితం కానుంది. <<18703423>>పుంగనూరు<<>> నియోజకవర్గం(6 మండలాలు)ను అన్నమయ్య జిల్లాలో కలుపుతూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో జిల్లాలో నియోజకవర్గాల సంఖ్య సైతం 7 నుంచి 6కు చేరుకుంది.

News December 29, 2025

OFFICIAL: చిత్తూరు నుంచి పుంగనూరు ఔట్

image

చిత్తూరు జిల్లా నుంచి పుంగనూరు నియోజకవర్గాన్ని వేరు చేయడం అధికారికంగా ఖరారైంది. మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి, పుంగనూరుతో అన్నమయ్య జిల్లాకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె ఉంటుంది. మరోవైపు బంగారుపాళ్యాన్ని పలమనేరు డివిజన్‌ నుంచి చిత్తూరులో కలిపారు. తిరుపతి జిల్లాలో రైల్వే కోడూరు విలీనానికి గ్రీన్ సిగ్నల్ చ్చారు. జనవరి 1 నుంచి మార్పులు అమలులోకి రానున్నాయి.