News September 5, 2024
మీ సాయం మరువలేం: పవన్ కళ్యాణ్

AP: వరద బాధితుల సహాయార్థం విరాళాలందించిన సినీనటులకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపింది. మహేశ్ బాబు, ప్రభాస్, జూ.ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, నందమూరి బాలకృష్ణ, సిద్ధు జొన్నలగడ్డ, సాయి తేజ్, వరుణ్ తేజ్ను ఉప ముఖ్యమంత్రి అభినందిస్తున్నారని ట్వీట్ చేసింది. కష్టకాలంలో ప్రజలకు అండగా, సహాయం చేసిన వారి ఔదార్యం మరెంతోమందికి భరోసా కల్పిస్తుందని పేర్కొంది.
Similar News
News November 6, 2025
రోడ్డు ప్రమాదాల్లో గాయపడిన వారికి ఉచిత వైద్యం: పొన్నం

TG: కేంద్రం ప్రవేశ పెట్టిన పథకంతో రోడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి రూ.లక్షన్నర వరకు ఫ్రీ వైద్యం అందిస్తున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. రోడ్డు భద్రతా చర్యలపై ఓ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటీవల జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు, మృతుల సంఖ్య అధికంగా ఉండటంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రోడ్డు ప్రమాదాల నివారణకు విద్యా సంస్థల్లో రోడ్ సేఫ్టీ, రూల్స్పై వ్యాసరచన పోటీలు నిర్వహించాలని సూచించారు.
News November 6, 2025
HLL లైఫ్కేర్ లిమిటెడ్లో 354 పోస్టులు

<
News November 6, 2025
ధాన్యం నిల్వలో తేమ శాతం ముఖ్యం

ధాన్యాన్ని నిల్వచేసేటప్పుడు తేమ 14% కన్నా ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి. గింజలలో తేమ శాతం తక్కువగా ఉంటే ధాన్యం రంగు మారదు, బూజు పట్టదు, కీటకాలు ఆశించవు. ధాన్యంలో తేమ 14%కు మించినప్పుడు, నిల్వ చేసే పద్ధతి సరిగా లేనప్పుడు ధాన్యానికి కీటకాలు, తెగుళ్లు ఆశించి నష్టం జరుగుతుంది. అందుకే ధాన్యాన్ని ఎక్కువ కాలం నిల్వ చేసేప్పుడు మధ్యలో అప్పుడప్పుడు చీడపీడలను పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.


