News September 6, 2024
శ్రీకాకుళం: అమృత్ భారత్ స్టేషన్ల పనులు పురోగతిపై కేంద్ర మంత్రి ఆరా

అమృత భారత్ స్టేషన్ల పథకంలో భాగంగా జిల్లాలోని శ్రీకాకుళం రోడ్డు రైల్వే స్టేషన్, పలాస, నౌపాడ, ఇచ్చాపురం స్టేషన్లలో జరుగుతున్న అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. విశాఖపట్నం వాల్తేర్ డివిజన్ డీఆర్ఎం సౌర ప్రసాద్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వాల్తేర్ డివిజన్లో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించిన పలు పనుల పురోగతిపై సమీక్ష నిర్వహించారు.
Similar News
News January 15, 2026
ఎస్పీ కార్యాలయంలో త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి వేడుకలు

కవిరాజు, ప్రముఖ సాహిత్య, సామాజిక వేత్త త్రిపురనేని రామస్వామి చౌదరి జయంతి వేడుకలు గురువారం శ్రీకాకుళం పోలీస్ కార్యాలయంలో గురువారం ఘనంగా నిర్వహించారు. జిల్లా అధనపు ఎస్పీ శ్రీనివాసరావు రామస్వామి చౌదరి చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సమాజంలో మూఢనమ్మకాలు కుల వివక్షత అసమానతలపై ఆయన నిర్భయంగా పోరాటం చేశారన్నారు. మానవతా విలువలు చాటి చెప్పారన్నారు.
News January 15, 2026
శ్రీకాకుళం: బస్సుల్లో టికెట్ల ధర అధికంగా వసూలు చేస్తున్నారా?

శ్రీకాకుళం జిల్లాకు వస్తున్న ప్రైవేట్ బస్సులు, ఇతర ప్రాంతాలకు వెళుతున్న బస్సులను విస్తృతంగా తనిఖీ చేస్తున్నట్లు జిల్లా ఉప రవాణా శాఖ అధికారి విజయ సారథి చెప్పారు. ఆర్టీజీఎస్ యాప్ సహకారంతో పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. ఈ నెల 18వ తేదీ వరకు తనిఖీలు సాగుతాయని వెల్లడించారు. అధిక ఛార్జీల వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని, అలా చేస్తే హెల్ప్ లైన్ నంబర్ 9281607001 కు సంప్రదించాలన్నారు.
News January 15, 2026
ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ

జిల్లా ప్రజలకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఎస్పీ మహేశ్వర్ రెడ్డి బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మకర సంక్రాంతి సుఖసంతోషాలను కమ్మని అనుభూతులను అందించాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక అయిన ఈ పండుగను ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా జరుపుకోవాలని పేర్కొన్నారు.


