News September 6, 2024

వరద బాధితులకు పెమ్మసాని రూ.కోటి విరాళం

image

AP: వరద బాధితులకు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ రూ.కోటి సాయం ప్రకటించారు. అలాగే ఎస్‌బీఐ అమరావతి సర్కిల్ రూ.5.87 కోట్లు, దేవీ సీ ఫుడ్స్ రూ.కోటి, కృష్ణా డెయిరీ ఛైర్మన్ చలసాని ఆంజనేయులు రూ.50 లక్షల సాయం అందించారు.

Similar News

News February 4, 2025

బసవతారకం ఆస్పత్రిలో ఉచిత క్యాన్సర్ టెస్టులు

image

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా HYD బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో ఉచిత క్యాన్సర్ నిర్ధారణ టెస్టులు చేయనున్నారు. ఇవాళ్టి నుంచి ఈనెల28 వరకు ఫ్రీ క్యాంప్ కొనసాగుతుందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఉ.10 నుంచి మ.ఒంటి గంట వరకు ఉచితంగా ప్రైమరీ టెస్టులు, ఆ తర్వాత అవసరమైన పరీక్షలను తక్కువ ధరకు చేయనున్నట్లు పేర్కొన్నాయి.

News February 4, 2025

పంచాయతీ ఎన్నికలపై BIG UPDATE

image

TGలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. ముందుగా MPTC, ZPTCలకు ఎన్నికలు నిర్వహించి, ఆ తర్వాత పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలిసింది. MPTC స్థానాల పునర్విభజన కోసం అధికారులు ఇప్పటికే జిల్లాల నుంచి నివేదికలు తెప్పించారు. ఇవాళ అసెంబ్లీ సమావేశం తర్వాత దీనిపై పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉంది. అటు ఈ నెల 15లోగా ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

News February 4, 2025

PGECET, ICET షెడ్యూల్ ఇదే

image

TG: ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఈ తదితర కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే PGECET నోటిఫికేషన్ మార్చి 12న విడుదల కానుంది. అదే నెల 17-19 వరకు దరఖాస్తుల స్వీకరణ, జూన్ 16 నుంచి 19 వరకు పరీక్షలు ఉండనున్నాయి.

☛ MBA, MCA తదితర కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే ICET నోటిఫికేషన్ మార్చి 6న రిలీజ్ కానుంది. అదే నెల 10 నుంచి మే 3 వరకు అప్లికేషన్లు స్వీకరిస్తామని అధికారులు తెలిపారు. జూన్ 8, 9న పరీక్ష ఉంటుంది.