News September 6, 2024
ఈరోజు నమాజ్ వేళలు
తేది: సెప్టెంబర్ 06, శుక్రవారం
ఫజర్: తెల్లవారుజామున 4:50 గంటలకు
సూర్యోదయం: ఉదయం 6:03 గంటలకు
జొహర్: మధ్యాహ్నం 12:14 గంటలకు
అసర్: సాయంత్రం 4:39 గంటలకు
మఘ్రిబ్: సాయంత్రం 6:25 గంటలకు
ఇష: రాత్రి 7.38 గంటలకు
నోట్: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
Similar News
News February 4, 2025
అంతుచిక్కని వ్యాధి.. 15 రోజుల్లో 40 లక్షల కోళ్లు మృతి
AP: అంతుచిక్కని వ్యాధి దెబ్బకు పౌల్ట్రీ పరిశ్రమ కుదేలవుతోంది. ఉభయగోదావరి జిల్లాల్లో 450 వరకు పౌల్ట్రీలు ఉండగా, 15 రోజుల్లోనే 40 లక్షలకు పైగా కోళ్లు మృత్యువాత పడినట్లు అంచనా. ఒక్కో కోడి మరణంతో సగటున రూ.300 వరకు నష్టం వస్తోందని రైతులు వాపోతున్నారు. కోళ్ల మరణాలకు కారణాలపై అధికారులు సైతం స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. శాంపిల్స్ను ల్యాబ్కు పంపామని, నివేదిక రావాల్సి ఉందని చెబుతున్నారు.
News February 4, 2025
నేడు పీఎం మోదీ ఏం మాట్లాడుతారు?
ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ సా.5 గంటలకు లోక్సభలో ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలపడంతో పాటు బడ్జెట్పై మాట్లాడనున్నారు. రాహుల్ గాంధీ సహా విపక్ష నేతల విమర్శలకు కౌంటర్ ఇచ్చే అవకాశం ఉంది. రేపు ఢిల్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆయన ఏం మాట్లాడతారనేది ఆసక్తిగా మారింది. ఉద్యోగులకు రూ.12లక్షల వరకు ట్యాక్స్ ఫ్రీ అంశాన్ని కూడా పీఎం ప్రస్తావించే ఛాన్సుంది.
News February 4, 2025
హైదరాబాద్కు బుల్లెట్ ట్రైన్
హైదరాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. 709K.M దూరమున్న ఈ ప్రాజెక్టు ఫైనల్ లొకేషన్ సర్వే కోసం రైల్వే శాఖ టెండర్లు పిలిచింది. ఈ నెల 24లోగా బిడ్లు దాఖలు చేయాలని సూచించింది. బుల్లెట్ రైలులో 2 గంటల్లోనే HYD నుంచి ముంబై చేరుకోవచ్చు. ఆ తర్వాత హైదరాబాద్-బెంగళూర్, చెన్నై మధ్య కారిడార్లు నిర్మించాలనే ఆలోచనతో ఉంది. ప్రస్తుతం ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ మార్గం సిద్ధమవుతోంది.