News September 6, 2024

3 రోజులు నానిన బండ్లు.. రిపేర్లకు రూ.వేల ఖర్చు

image

AP: విజయవాడలో వేలాది వాహనాలు రిపేర్లకొచ్చాయి. మూడు రోజులు నీటిలో నానడంతో బైకులు స్టార్ట్ అవ్వడం లేదు. దీంతో సింగ్ నగర్, జక్కంపూడి, రాజరాజేశ్వరిపేట, ఏలూరు రోడ్డు, గుణదల తదితర ప్రాంతాల్లోని మెకానిక్ షెడ్లు రద్దీగా మారాయి. అర్జెంట్ అంటే కుదరదని టైమ్ పడుతుందని మెకానిక్‌లు వాహనదారులకు చెబుతున్నారు. ఇంజిన్‌లోకి నీరు చేరడం, వైరింగ్ సిస్టమ్ పాడవడం లాంటి సమస్యలకు భారీగా ఖర్చవుతోంది.

Similar News

News February 4, 2025

BREAKING: భారీగా పెరిగిన బంగారం ధరలు

image

పెళ్లిళ్ల సీజన్ వేళ పసిడి ధరలు భయపెడుతున్నాయి. ఇవాళ హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం ధరలు భారీగా పెరిగాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.1,050 పెరిగి రూ.78,100లకు చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ.1,150 పెరగడంతో రూ.85,200 పలుకుతోంది. ఇక కేజీ సిల్వర్ రేటు రూ.1,000 తగ్గి రూ.1,06,000లకు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి.

News February 4, 2025

ఐటీ విచారణకు దిల్ రాజు

image

ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఐటీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఇటీవల ఆయన కార్యాలయంతో పాటు నివాసాల్లో ఐటీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో వ్యాపారాలకు సంబంధించిన వివరాలు ఇవ్వాలని నోటీసులు జారీ చేశారు.

News February 4, 2025

US నుంచి స్వదేశానికి భారతీయ వలసదారులు

image

వివిధ దేశాల నుంచి అమెరికాలో ప్రవేశించిన అక్రమ వలసదారులను ట్రంప్ తిరిగి పంపించేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు భారత్ వంతు వచ్చేసింది. భారత్‌కు చెందిన 205 మంది అక్రమ వలసదారులతో US మిలిటరీ విమానం టెక్సాస్‌లోని శాన్ ఆంటోనియో నుంచి ఇండియాకు బయలుదేరింది. కాగా అక్కడ 18,000 మంది భారతీయులు అక్రమంగా నివసిస్తున్నట్లు భారత్, US గుర్తించాయని ఇటీవల బ్లూమ్‌బెర్గ్ న్యూస్ పేర్కొంది.

error: Content is protected !!