News September 6, 2024

రాజమండ్రిలో యాక్సిడెంట్.. శ్రీకాకుళం వాసి మృతి

image

రాజమండ్రిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్(20) మృతి చెందారు. రాజమండ్రి దివాన్ చెరువు వైపుకు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక నుంచి లారీ ఢీ కొట్టగా ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మృతులు గైట్ కళాశాలలో ఇంజినీరింగ్ సెకండీయర్ చదువుతున్నారు. లారీ డ్రైవర్ పరారీలో ఉన్నారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

Similar News

News January 1, 2026

శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

image

★శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా జరిగిన న్యూయర్ వేడుకలు
★శ్రీకాకుళం: దువ్వాడ ఇష్యూలో అప్పన్న మిస్సింగ్
★క్యాబేజీ పువ్వులతో కేంద్ర, రాష్ట్ర మంత్రులకు న్యూ ఇయర్ విషెస్
★ఎల్.ఎన్ పేట: వ్యర్థాలకు నిప్పు.. గ్రామస్థులకు ముప్పు
★సారవకోట: పైపుల కోసం రోడ్డును తవ్వి వదిలేశారు
★పలాసలో నారీ శక్తి యాప్‌పై అవగాహన

News January 1, 2026

‘శ్రీకాకుళం జిల్లాలో ఉపాధి వేతనదారులకు రూ.322 కోట్లు చెల్లించాం’

image

జిల్లాలో గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా ఉపాధి వేతనదారులకు ఇప్పటివరకు ఆర్థిక సంవత్సరంలో రూ.322 కోట్ల చెల్లించడం జరిగిందని డ్వామా పీడీ లవరాజు తెలిపారు. బుధవారం సాయంత్రం జలుమూరులోని స్థానిక కార్యాలయంలో క్షేత్ర సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. వేతనదారులకు మరో రూ.14 కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. ఇప్పటివరకు కోటి 36 లక్షల పది దినాలు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు.

News January 1, 2026

2026ను స్వాగతించి..శుభాకాంక్షలు చెప్పిన ఇసుక కళాఖండం

image

ఎల్.ఎన్.పేట మండలం లక్ష్మీనర్సుపేట గ్రామానికి చెందిన ప్రముఖ సైకత శిల్పి ప్రసాద్ మిశ్రా వంశధార నది తీరంలో బుధవారం రూపొందించిన సైకత శిల్పం ఎంతగానో ఆకట్టుకుంటుంది. జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సరాన్ని స్వాగతిస్తూ 2026 ఆకృతిలో తీర్చిదిద్దిన కళారూపం చూపరులను కట్టిపడేసింది. కొత్త సంవత్సరంలో అన్ని వర్గాలకు మంచి జరగాలని ఈ ఇసుక కళాఖండంతో ఆయన ఆకాంక్షించారు.