News September 6, 2024

వరద నష్టం అంచనాకు ఇంటర్ మినిస్టీరియల్ టీమ్: కేంద్రం

image

ఏపీ, తెలంగాణలో వరద నష్టం అంచనా వేసేందుకు ఇంటర్ మినిస్టీరియల్ సెంట్రల్ టీమ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర హోంశాఖ తెలిపింది. TGలో 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 2 ఎయిర్‌పోర్స్ హెలికాప్టర్లు, ఏపీలో 26 ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, 8 ఎయిర్‌ఫోర్స్, 2 నేవీ హెలికాప్టర్లు, డోర్నియల్ ఎయిర్‌క్రాఫ్ట్ సహాయక చర్యల్లో పాల్గొంటున్నట్లు పేర్కొంది. మరోవైపు ఇండియన్ ఆర్మీ విజయవాడలోని బుడమేరు వాగు గండ్లు పూడుస్తోంది.

Similar News

News September 19, 2024

5,600 మంది ఉద్యోగులపై ‘సిస్కో’ వేటు

image

ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచవ్యాప్తంగా 4వేల మంది ఉద్యోగులను తొలగించిన టెక్ దిగ్గజం సిస్కో మరో దశ లేఆఫ్స్‌కు సిద్ధమైంది. మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 7 శాతం(5,600) సిబ్బందిని తొలగించనున్నట్లు ప్రకటించింది. అయితే ఏయే విభాగాలు ప్రభావితం అవుతాయో వెల్లడించలేదు. కాగా అక్కడ పని వాతావరణం ఏమాత్రం బాగాలేదని పలు నివేదికలు చెబుతున్నాయి. మరోవైపు ఆ కంపెనీ వార్షిక ఆదాయం రికార్డు స్థాయిలో $54 బిలియన్లకు చేరింది.

News September 19, 2024

పాక్ హాకీ ఆటగాళ్లకు రూ.8,366ల బహుమతి

image

ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో మూడో స్థానంలో నిలిచి బ్రాంజ్ మెడల్ సాధించిన పాక్ హాకీ టీమ్‌కు ఆ దేశ హాకీ ఫెడరేషన్ బహుమతి ప్రకటించింది. ఆటగాళ్లు, సిబ్బందికి 100 డాలర్ల(రూ.8,366) చొప్పున ప్రైజ్ మనీ ఇస్తామని తెలిపింది. ఇంత తక్కువ ఇవ్వడం దారుణమని, అసలు ఇవ్వకపోయి ఉంటే బాగుండేదని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సెమీస్‌లో చైనా చేతిలో ఓడిన పాక్.. కాంస్య పతక పోరులో కొరియాపై 5-2 తేడాతో గెలిచిన విషయం తెలిసిందే.

News September 19, 2024

వేమన నీతి పద్యం- తాత్పర్యం

image

కర్మ మధికమైన గడచి పోవగరాదు
ధర్మరాజు దెచ్చి తగని చోట
గంకుభట్టు జేసెగటకటా దైవంబు
విశ్వదాభిరామ! వినుర వేమ!
తాత్పర్యం: కర్మ ఎవరినీ వదిలిపెట్టదు. ప్రతికూల సమయం వచ్చినప్పుడు ధర్మరాజు కూడా విరాట రాజువద్ద కంకుభట్టు వేషాన్ని ధరించాల్సి వచ్చింది.