News September 6, 2024
ములుగు: సర్వే చేస్తున్న ఫారెస్ట్ అధికారులు
తాడ్వాయి-మేడారం అటవీ ప్రాంతంలో పెద్ద సంఖ్యలో చెట్లు నేలకొరగడంపై అటవీ శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక సమర్పించనుంది. దీనిలో భాగంగా ఫారెస్ట్ అధికారులు సర్వే చేపట్టారు. విపత్తు కారణంగా 204కు పైగా హెక్టార్లలో దాదాపు 70వేల చెట్లకు నష్టం జరిగినట్లు అధికారులు తెలిపారు. ఈ విపత్తులో 60,70 రకాల చెట్లు నేలకులాయి. రెండు, మూడు రోజుల్లో అంచన నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపనున్నట్లు తెలిపారు.
Similar News
News October 8, 2024
వరంగల్: పండుగ సందర్భంగా 6556 ప్రత్యేక రైళ్లు
భారతీయ రైల్వేలు అక్టోబర్ 6 నాటికి దుర్గాపూజ, దీపావళి, ఛత్ పూజల సమయంలో ప్రయాణికుల సౌకర్యం కోసం ఈ ఏడాది అక్టోబర్ 1 నుంచి నవంబర్ 30 వరకు 6556 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రౌల్వే ప్రకటించినది. ప్రతి సంవత్సరం పండుగల సమయంలో ప్రత్యేక రైళ్లు నడుపుతున్నట్లు పేర్కొంది. ఈ ఏడాది ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా రైళ్ల సంఖ్యను గణనీయంగా పెంచినట్లు రైల్వే సీపీఆర్వో శ్రీధర్ తెలియజేశారు.
News October 8, 2024
HYD నుంచి ఓరుగల్లుకు బాట!
దసరా పండుగతో HYD ఖాళీ అవుతోంది. ఉద్యోగాల కోసం నగరానికి వచ్చిన ఓరుగల్లు ప్రజలు సొంతూళ్లకు పయనమయ్యారు. ఈ క్రమంలో ఉప్పల్ రింగ్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్సుల కోసం క్యూ కట్టారు. దీంతో ఉప్పల్లో ప్రయాణికుల రద్దీ పెరిగింది. ప్రత్యేక బస్సులు నడిపిస్తున్నప్పటికీ ప్రయాణికుల సంఖ్యకు సరిపోవడం లేదు. పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో కిక్కిరిసి ప్రయాణించాల్సిన పరిస్థితి ఏర్పడింది. మీరూ వస్తే కామెంట్ చేయండి.
News October 8, 2024
HNK: ‘పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది’
తల్లిదండ్రులు లేకపోయినా నిరుత్సాహ పడలేదు. పట్టుదలతో చదివి ప్రభుత్వ ఉద్యోగం సాధించింది. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రానికి చెందిన బొల్లెపల్లి శ్రీజకు తల్లిదండ్రులు లేరు. అయినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో పోటీ పరీక్షలు రాసి మల్టీ జోనల్ 22వ ర్యాంక్ సాధించింది. ఆదివారం సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ ఉద్యోగులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో ఈవోగా నియామక పత్రం అందుకుంది.