News September 6, 2024

విజయవాడ: ‘ఫేక్ కథనాలను వ్యాప్తి చేస్తే కఠినచర్యలు’

image

విజయవాడ వరదలపై ఫేక్ కథనాలను వ్యాప్తి చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏపీ పోలీసులు హెచ్చరించారు. ఈ మేరకు తమ అధికారిక ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రకృతి ప్రకోపానికి విజయవాడలో లక్షల మంది ప్రజలు నష్టపోయారని చెప్పారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో దురుద్దేశంతో ఫేక్ కథనాలు సామాజిక మాధ్యమాలలో పోస్ట్ చేసే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.

Similar News

News March 2, 2026

కృష్ణా జిల్లాలో టుడే టాప్ న్యూస్

image

* కృష్ణా యూనివర్సిటీ MBA/MCA పరీక్షల షెడ్యూల్ విడుదల
* కొడాలి నానిపై గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఫైర్
* కృష్ణాలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షకు 255 మంది గైర్హాజరు
* కృష్ణా జిల్లా వ్యాప్తంగా బాణాసంచా దుకాణాల్లో తనిఖీలు
* విజయవాడలో ప్రాణం తీసిన సెల్ఫీ
* గన్నవరంలో గరికపాటి వ్యాఖ్యలపై కమలానంద భారతి అభ్యంతరం

News March 2, 2026

కృష్ణా: సుంకం ఇవ్వు .. చెరువు తవ్వు..!

image

కృష్ణా జిల్లాలో వరి పొలాలు అక్రమంగా చేపలు, రొయ్యల చెరువులుగా మారుతున్నాయనే ఆరోపణలొస్తున్నాయి. కృత్తివెన్ను, బంటుమిల్లి, మచిలీపట్నం, అవనిగడ్డ పరిధిలో వందల ఎకరాల సాగు భూములతో పాటు మడ అడవులను సైతం ఆక్రమించి తవ్వకాలు జరుపుతున్నారు. చెరువుల వ్యర్థ నీరు కాలువల్లోకి వదులుతుండటంతో పక్కనే ఉన్న పంట పొలాలు నిస్సారమవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాప్రతినిధుల అండతోనే ఇవి జరుగుతున్నాయని టాక్.

News March 2, 2026

మచిలీపట్నంలో మరో ఫోన్ నంబర్

image

మచిలీపట్నం ఆర్టీసీ బస్టాండ్‌లోని సమాచార కేంద్రంలో ప్రస్తుతం ఉన్న ల్యాండ్ లైన్ ఫోన్ నంబర్ తోపాటు కొత్తగా సెల్ ఫోన్ నంబర్ 94947 75462ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు డిపో మేనేజర్ పెద్దిరాజు తెలిపారు. ప్రయాణికులు విచారణ నిమిత్తం గతంలో ఉన్న ల్యాండ్ లైన్ నంబర్ 08672-227000తోపాటు నూతన సెల్ నెంబర్ 94947 75462ను సద్వినియోగం చేసుకోవాలని డీఎం కోరారు.