News September 6, 2024

క్యాన్సర్ పరీక్షలు త్వరగా నిర్వహించాలి: ఎంపీ

image

ప్రాథమిక స్థాయిలో క్యాన్సర్ గుర్తించిన వారికి త్వరగా నిర్ధారణ పరీక్షలు చేయాలని ఎంపీ గురుమూర్తి కోరారు. చిత్తూరు జడ్పీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి జిల్లాలో 190 మందికి క్యాన్సర్ నిర్ధారణ అయినట్టు వైద్య ఆరోగ్యశాఖ నివేదికలో తేలిందన్నారు. క్యాన్సర్ లక్షణాలు గుర్తించిన వారికి స్క్రీనింగ్ చేయడంలో ఎందుకు జాప్యం చేస్తున్నారని నిలదీశారు.

Similar News

News January 15, 2026

రొంపిచర్ల: కోళ్లఫారంలో యువకుడి సూసైడ్

image

రొంపిచర్ల: కోళ్ల ఫారంలో యువకుడు ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై మధుసూదన్ చెప్పారు. పశ్చిమ బెంగాల్‌కి చెందిన రవీంద్ర చిక్బరైక్ (29) ఓ కోళ్లఫారంలో పనిచేస్తున్నాడు. ఆరోగ్యం సరిగాలేదని అతని భార్య రష్మీ తెలియజేసినట్లు ఎస్సై తెలిపారు. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

News January 15, 2026

చిత్తూరు ఎస్పీకి నోటీసులు

image

చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్‌కు జాతీయ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. చిత్తూరుకు చెందిన దివ్యాంగురాలైన కవిత మృతి కేసులో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని న్యాయవాది అర్షద్ అయుబ్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నోటీసులు జారీ అయినట్లు సమాచారం. కేసు దర్యాప్తు చేస్తున్న సంబంధిత అధికారులు ఈనెల 21న కమిషన్ ముందు హాజరై నివేదికను అందజేయాల్సి ఉంది.

News January 15, 2026

చిత్తూరు: మీ ఫ్రెండ్స్‌ను కలిశారా..?

image

చిత్తూరులో ఉంటే జీతం సరిపోదు. తప్పని పరిస్థితుల్లో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ తదితర నగరాలకు వెళ్లాల్సిన పరిస్థితి. ఎన్ని బాధలు ఉన్నప్పటికీ, ఎంత కష్టమైనప్పటికీ సంక్రాంతికి సొంతూరికి వచ్చేస్తుంటారు. ఈ మూడు నాలుగు రోజులు సరదాగా గడిపేస్తుంటారు. చాలా మంది తమ స్కూల్, కాలేజీ నాటి ఫ్రెండ్స్‌ను ‘గెట్ టూ గెదర్’ పేరిట కలుస్తుంటారు. మరి ఈ సారి మీ ఫ్రెండ్స్‌ను కలిశారా? లేదా కామెంట్ చేయండి.