News September 6, 2024

ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు.. నలుగురు పిల్లలను పోగొట్టుకున్న తల్లి

image

MPలోని అశోక్ నగర్ జిల్లాలో ముంగావలిలో ఓ తల్లి నలుగురు పిల్లలను పోగొట్టుకుంది. పసిబిడ్డను ఆసుపత్రికి తీసుకురాగా హిమోగ్లోబిన్ తక్కువగా ఉందని డాక్టర్లు చెప్పారు. చికిత్స అనంతరం డిశ్చార్జ్ అయ్యాక 2రోజులకు శిశువు మరణించింది. ఇంతకుముందూ ఇలాగే సరైన చికిత్స అందక ముగ్గురు పిల్లలు చనిపోయారు. మరో పాప పోషకాహార లోపంతో ఉన్నా అధికారులు సరిగా స్పందించకపోవడం గమనార్హం. ఇది దేశంలోని వైద్య వ్యవస్థ లోపాలకు నిదర్శనం.

Similar News

News January 25, 2026

చెప్పింది 3 వేలు.. అసలు లెక్క 30 వేలు!

image

ఇరాన్ నిరసనల్లో మృతుల సంఖ్య భారీగా పెరిగినట్లు తెలుస్తోంది. జనవరి 8, 9వ తేదీల్లోనే దాదాపు 30 వేల మంది మృతి చెందినట్లు USకు చెందిన TIME మ్యాగజైన్ వెల్లడించింది. ప్రభుత్వం ప్రకటించిన 3,117 మరణాల కంటే హాస్పిటల్‌ రికార్డులు, స్థానిక అధికారులు, వైద్యులు తెలిపిన సంఖ్య ఎక్కువగా ఉందని తెలిపింది. సుమారు 4,000 ప్రాంతాల్లో నిరసనలు జరగగా ఇంటర్నెట్ ఆపేయడం వలన వాస్తవ పరిస్థితి ప్రపంచానికి తెలియలేదని పేర్కొంది.

News January 25, 2026

ప్రియుడి ఇంటికి నిప్పు.. చివరికి

image

AP: ప్రియుడిపై కోపంతో అతడి ఇంటికి ప్రియురాలు నిప్పు పెట్టిన ఘటన గుంటూరులోని సుద్దపల్లిలో చోటు చేసుకుంది. వివాహితుడైన మల్లేశ్‌(31)తో దుర్గ(28) అక్రమసంబంధం పెట్టుకోగా ఇరువురి మధ్య గొడవలు పెరిగాయి. ఈ క్రమంలో ప్రియుడు కుటుంబం ఇంట్లో ఉండగా దుర్గ పెట్రోల్ పోసి నిప్పంటించింది. పెట్రోల్ మీద పడి దుర్గకు కూడా తీవ్రగాయాలు కాగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించింది.

News January 25, 2026

పాక్ మాజీ క్రికెటర్ కొడుకుపై రేప్ కేసు!

image

పాక్ మాజీ క్రికెటర్ అబ్దుల్ ఖాదిర్ కొడుకు సులామన్‌ తనను రేప్ చేశారని పనిమనిషి కేసు పెట్టారు. ఇంట్లో పని చేయడానికి వచ్చిన తనను బలవంతంగా ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి లైంగిక వేధింపులకు గురిచేసినట్టు ఆరోపించారు. విచారణ కోసం నిందితుడిని అదుపులోకి తీసుకుని, బాధితురాలిని మెడికల్ టెస్టులకు తరలించినట్టు పోలీసులు తెలిపారు. సులామన్ 2005-2013 మధ్య 26 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లు, 40 లిస్ట్ ఎ మ్యాచ్‌లు ఆడారు.