News September 7, 2024
భారత్లో ముషారఫ్ సంబంధీకుల ఆస్తి.. రూ.1.39 కోట్లకు వేలం

పాకిస్థాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ సన్నిహితుల ఆస్తిని భారత్ ఈ నెల 5న రూ.1.39 కోట్లకు వేలం వేసింది. ఉత్తరప్రదేశ్లోని బాగ్పత్లో ఆయన సంబంధీకుల పేరిట ఆస్తి ఉంది. స్థానిక రైతులు ముగ్గురు కలిసి దాన్ని కొనుగోలు చేశారు. 2010లో ఆ ఆస్తిని ‘శత్రువుల ఆస్తి’గా భారత్ ప్రకటించింది. అప్పటి నుంచీ ఇది ‘ఎనిమీ ప్రాపర్టీ కస్టోడియన్ ఆఫీస్’ అధీనంలోనే ఉంది. కాగా.. ముషారఫ్ గత ఏడాది మరణించిన సంగతి తెలిసిందే.
Similar News
News January 13, 2026
ఇరాన్ నిరసనల్లో 12 వేల మంది చనిపోయారా?

ఇరాన్ నిరసనల్లో 2వేల మంది <<18846903>>చనిపోయారని<<>> వార్తలు వచ్చాయి. కానీ అక్కడి ప్రతిపక్షాలు మాత్రం భద్రతా దళాల కాల్పుల్లో 12వేల మంది చనిపోయారని సంచలన ఆరోపణలు చేశాయి. ఇది ఇరాన్ ఆధునిక చరిత్రలో అతిపెద్ద మారణకాండ అని, లెక్కలోకి రాని మరణాలు వందల్లో ఉండొచ్చని Iran International సంస్థ చెప్పింది. ఈనెల 8, 9తేదీల్లో ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కార్ప్స్, బాసిజ్ యూనిట్లు చేసిన దాడుల్లో ఎక్కువ మంది చనిపోయారని తెలిపింది.
News January 13, 2026
త్వరలో 10వేల పోస్టుల భర్తీ: మంత్రి దామోదర

TG: త్వరలోనే ఆరోగ్యశాఖలో 10వేల పోస్టులు భర్తీ చేస్తామని మంత్రి దామోదర రాజనర్సింహ చెప్పారు. HYD కోటీలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ గ్రౌండ్స్లో 1,257 మంది ల్యాబ్ టెక్నీషియన్లకు నియామక పత్రాలు అందజేశారు. ఇప్పటివరకు ఆరోగ్యశాఖలో 9,572 పోస్టులు భర్తీ చేసినట్లు తెలిపారు. జంట నగరాల్లో 145 పాలిక్లినిక్లు, రాష్ట్రంలో 80 డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. పేదల ఆరోగ్యభద్రత ప్రభుత్వ బాధ్యత అన్నారు.
News January 13, 2026
‘మన శంకరవరప్రసాద్ గారు’.. చిరంజీవి రెమ్యునరేషన్ ఎంతంటే?

‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు మెగాస్టార్ చిరంజీవి రూ.70 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నట్లు టాలీవుడ్ టాక్. ఈ మూవీకి చిరు కూతురు సుష్మిత కో-ప్రొడ్యూసర్గా ఉన్న విషయం తెలిసిందే. కాగా 1992లో ఆపద్బాంధవుడు సినిమాకు రూ.కోటితో దేశంలోనే అత్యధిక పారితోషికం తీసుకున్న నటుడిగా మెగాస్టార్ రికార్డు సృష్టించారు. ఆచార్య, వాల్తేరు వీరయ్య సినిమాలకు రూ.50 కోట్లు, భోళా శంకర్కు రూ.63 కోట్లు తీసుకున్నట్లు సమాచారం.


