News September 7, 2024

ఖైరతాబాద్ గణేష్ తయారీలో మన కాకినాడ వాసులు

image

హైదరాబాద్‌లో ఖైరతాబాద్ భారీ వినాయకుడి విగ్రహానికి రంగులు వేసి సుందరంగా తీర్చిదిద్దేది కాజులూరు మండలం గొల్లపాలెంకి చెందిన ‘సత్యఆర్ట్స్’ సభ్యులే. 20 ఏళ్లుగా ఖైరతాబాద్ వినాయకుడికి రంగులు వేసే పనిని వీరే చూస్తున్నారు. ఈ ఏడాది 70 అడుగుల శ్రీ సప్తముఖ మహాగణపతి అవతారంలో స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. సత్యఆర్ట్స్ బృందం 15 రోజులు శ్రమించి రంగులు దిద్ది పని పూర్తిచేశారు.

Similar News

News August 22, 2025

గుడ్డిగూడెంలో ట్రాక్టర్ బోల్తా..మహిళ మృతి

image

గోపాలపురం మండలం గుడ్డిగూడెం గ్రామం సమీపంలో కూలీలతో వెళ్లిన ట్రాక్టర్ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒక మహిళ దుర్మరణం చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పొలం పనులు ముగించుకొని ఆరుగురు కూలీలు ట్రాక్టర్‌లో ప్రయాణిస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. క్షతగాత్రులను స్థానికులు ఆసుపత్రికి తరలించారు.

News August 22, 2025

కాటన్ బ్యారేజీ వద్ద పెరుగుతున్న గోదావరి నీటిమట్టం

image

రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి నీటిమట్టం పెరగడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పడవ ప్రయాణాలు, చేపలు పట్టడం, ఈతకు దిగడం వంటివి పూర్తిగా నిషేధమని జిల్లా యంత్రాంగం తెలిపింది. సహాయం కోసం 1070, 112 నంబర్లను సంప్రదించాలని సూచించింది.

News August 22, 2025

స్టాక్ పాయింట్లలో 12,97,874 మెట్రిక్ టన్నుల ఇసుక: కలెక్టర్

image

తూర్పు గోదావరి జిల్లాలో మొత్తం 37 స్టాక్ పాయింట్లలో 12,97,874 మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉందని కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు. అరికిరేవుల, ధవళేశ్వరం, మునిపల్లి వంటి ప్రధాన స్టాక్ పాయింట్ల వద్ద ఇసుకను నిల్వ ఉంచినట్లు ఆమె వెల్లడించారు. ఇతర జిల్లాలకు సరఫరా చేయడానికి మరిన్ని స్టాక్ పాయింట్లను సిద్ధం చేశామన్నారు.