News September 7, 2024

అలాంటి స్టూడెంట్స్‌కు పనిష్‌మెంట్ వద్దు: విద్యాశాఖ

image

TG: రాఖీలు, తిలకం, మెహిందీ వంటి వాటితో స్కూళ్లకు వచ్చే విద్యార్థులకు పనిష్‌మెంట్ ఇవ్వొద్దని విద్యాశాఖ డైరెక్టర్ నర్సింహారెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఇలాంటి వాటితో వచ్చే కొందరు స్టూడెంట్స్‌ను కార్పొరల్ పనిష్‌మెంట్ పేరిట వేధిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఒకవేళ అలాంటి ఘటనలు జరిగినట్లు తేలితే ఆర్టీఈ యాక్ట్-2009 సెక్షన్-17 ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News February 4, 2026

మున్సిపల్ ఎన్నికల బరిలో 12,993 మంది

image

TG: మున్సిపల్‌ ఎన్నికల ప్రక్రియలో నామినేషన్ల ఉపసంహరణ గడువు నిన్నటితో ముగిసింది. మొత్తంగా 12,993 మంది అభ్యర్థులు బరిలో నిలిచినట్టు SEC తెలిపింది. రాష్ట్రంలో 123 పట్టణ స్థానిక సంస్థల్లో 2,996 వార్డులు, డివిజన్లకు ఎలక్షన్ జరగనుంది. దీంతో ప్రతి వార్డుకు సగటున నలుగురు అభ్యర్థుల చొప్పున పోటీ పడుతున్నారు. ఈ నెల 9తో ఎన్నికల ప్రచారం ముగియనుంది. 11న పోలింగ్ జరుగుతుంది. 13న ఫలితాలు వెల్లడిస్తారు.

News February 4, 2026

జ్ఞానానికి కేంద్రం ‘ఆజ్ఞా చక్రం’

image

2 కనుబొమ్మల మధ్య ఉండే ఈ చక్రం జ్ఞానానికి, అంతర్ దృష్టికి కేంద్రం. ఇది సమతుల్యంగా ఉంటే ఏకాగ్రత, స్పష్టమైన ఆలోచనలు, భవిష్యత్తును ఊహించే శక్తి పెరుగుతాయి. ఇది అస్థిరంగా ఉంటే తలనొప్పి, గందరగోళం, చూపు మందగించడం వంటివి జరుగుతాయి. దీనిని ఉత్తేజితం చేయడానికి ‘ఓం’ మంత్రాన్ని జపిస్తూ భృకుటిపై దృష్టి సారించి ధ్యానం చేయాలి. నీలి రంగు/ఊదా రంగు దుస్తులు వాడటం, నిశ్శబ్దంగా గడపడం వల్ల ఈ చక్రం శక్తివంతమవుతుంది.

News February 4, 2026

రికార్డు స్థాయిలో UPI లావాదేవీలు: పంకజ్ చౌదరి

image

డిజిటల్ చెల్లింపులు జరిపేవారి సంఖ్య పెరగడంతో.. భారత UPI లావాదేవీలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరం DEC వరకు UPI ద్వారా రికార్డు స్థాయిలో రూ.230 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి రాజ్యసభలో వెల్లడించారు. 2022-23లో జరిగిన మొత్తం రూ.139 లక్షల కోట్ల లావాదేవీలతో పోలిస్తే ఇది చాలా ఎక్కువని, భారత్ వెలుపలా UPI వినియోగం పెరగడం హర్షణీయమన్నారు.