News September 7, 2024

నెల్లూరు: బాధితుల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు

image

విజయవాడ వరద బాధితులకు ఆహారం, తాగునీటిని అందించాలనుకునే వారు కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 0861 2331261, 79955 76699 కాల్ సెంటర్ ద్వారా సమాచారం పొం దాలని అధికారులు సూచించారు. ఆర్థిక సాయం చేయాలనుకునే వారు CMRF పేరిట డీడీ తీసి, కలెక్టర్ కు అందజేయాలని, వీటిని సీఎం కార్యాలయానికి పంపుతామని చెప్పారు.

Similar News

News December 29, 2025

నెల్లూరులోకి గూడూరు.. ఆ రెండు తిరుపతిలోనే!

image

గూడూరు నియోజకవర్గాన్ని నెల్లూరు జిల్లాలో కలపాలనే డిమాండ్‌తో ప్రజలు ఉద్యమాలు చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి నెల్లూరులో కలపడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. CM చంద్రబాబుతో ఆదివారం జరిగిన చర్చల్లో కొత్త ప్రతిపాదన తెరపైకి వచ్చిందంట. గూడూరు, కోట, చిల్లకూరు మండలాలనే నెల్లూరులో కలిపి.. వాకాడు, చిట్టమూరును తిరుపతి జిల్లాలో కొనసాగిస్తారని సమాచారం. నేటి క్యాబినెట్ మీటింగ్ తర్వాత అధికార ప్రకటన చేయనున్నారు.

News December 28, 2025

STలకు రేషన్ కార్డులు, గ్యాస్ కనెక్షన్లు: DSO

image

జిల్లా వ్యాప్తంగా రేషన్, గ్యాస్ కనెక్షన్ లేని ఎస్టీలు వందల సంఖ్యలో ఉన్నారని, వారికి త్వరలోనే కార్డులు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను డీఎస్ఓ లీలారాణి ఆదేశించారు. ఇటీవల సంభవించిన తుఫాన్ ధాటికి అధిక సంఖ్యలో ఎస్టీలు దెబ్బతిన్నారన్నారు. వారికి నిత్యవసర సరకులు పంపిణీ చేసే క్రమంలో రేషన్ కార్డు లేకపోవడం గుర్తించామన్నారు.

News December 28, 2025

పెంచలకోనపై వీడని పీటముడి.. అటా.. ఇటా?

image

కొంచెం ఇష్టం.. కొంచెం కష్టం అన్నట్లుంది నెల్లూరు జిల్లా పరిస్థితి. గూడూరును నెల్లూరులో కలపడానికే CM సానుకూలత వ్యక్తం చేశారట. వెంకటగిరి నియోజకవర్గంలోని మండలాలపై మాత్రం పీటముడి వీడటం లేదు. కలువాయి, సైదాపురం, రాపూరు మండలాలను నెల్లూరులో కలపాలన్న గట్టి డిమాండ్ ఉంది. కలువాయి(M)న్ని నెల్లూరులో, సైదాపురం, రాపూరు(M)న్ని మాత్రం తిరుపతిలోనే ఉంచనున్నారట. దీంతో పెంచలకోన తిరుపతిలోనే ఉండనుంది.