News September 7, 2024
విశాఖ నుంచి కొత్తగా 4 విమాన సర్వీసులు

విశాఖ విమానాశ్రయం నుంచి కొత్తగా మరో 4 ఇండిగో ఎయిర్ లైన్స్ విమానం సర్వీసులను నడపనుంది. సెప్టెంబర్ 21న విశాఖ హైదరాబాద్ సర్వీస్ ప్రారంభం కానుంది. తర్వాత అక్టోబర్ 27న విశాఖ విజయవాడ సర్వీస్ను ప్రారంభించనున్నారు. అదేరోజు విశాఖ హైదరాబాద్ సర్వీస్ కూడా ప్రారంభిస్తారు. అలాగే విశాఖ అహ్మదాబాద్ కు వారానికి మూడు రోజుల కొత్త సర్వీసులు నడపనున్నట్లు ఏపీ ఏటీఏ ఇన్ఛార్జులు కుమార్ రాజా, డీఎస్ వర్మ తెలిపారు.
Similar News
News March 1, 2026
రూపాయికే ఎకరా.. చిన్న కంపెనీకి భారీ రాయితీనా: వైసీపీ

తర్లువాడలో సెమీకండక్టర్ యూనిట్కు ఎకరాకు రూపాయి చొప్పున 30 ఎకరాల భూమి కేటాయింపుపై YCP సందేహాలు వ్యక్తం చేసింది. ASIP టెక్నాలజీస్ లాంటి చిన్న ప్రైవేట్ సంస్థకు వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఇంత తక్కువ ధరకు ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశం ఏమిటని ప్రశ్నించింది. ఈ నిర్ణయంపై ప్రజల సందేహాలను నివృత్తి చేయాలని వైసీపీ నేత అమర్నాథ్ SMలో డిమాండ్ చేశారు. మంత్రి లోకేశ్, టీడీపీ స్పష్టత ఇవ్వాలన్నారు.
News March 1, 2026
విశాఖలో పెరుగుతున్న డ్రగ్స్ కేసులు.. యువతే లక్ష్యం

నగరంలో డ్రగ్స్ కేసులు పెరుగుతున్నాయి. బెంగళూరు, హైదరాబాద్, గోవా నుంచి డ్రగ్స్, ఎండీఎంఏ, హ్యాష్ ఆయిల్ తెచ్చి విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. జనవరి 22న పెందుర్తిలో 4 గ్రా. ఎండీఎంఏ స్వాధీనం కాగా, రెండు రోజుల క్రితం ఎంవీపీ పోలీసులు 2.23 గ్రా. యువకుడిని అరెస్ట్ చేశారు. గతేడాది నగర పరిధిలో గంజాయి, హ్యాష్ ఆయిల్ తదితరవి పట్టుబడగా వాటి విలువ రూ.5 కోట్లగా ఉంది. 500 పైగా కేసులు నమోదు అయ్యాయి.
News March 1, 2026
విశాఖలో కాయగూరల ధరలు ఇలా(కేజీల్లో)..

విశాఖలోని 15 రైతు బజార్లో కాయగూరలు ధరలు ఆదివారం ఇలా ఉన్నాయి. పూస వంకాయలు రూ.16, టమాటా రూ.10, కాకరకాయలు రూ.34, బెండకాయలు రూ.42, పచ్చిమిర్చి రూ.54, బీరకాయలు రూ.30, క్యాబేజీ రూ.14, క్యారెట్ రూ.22, దొండకాయలు రూ. 28, ఉల్లిపాయలు రూ.18, గోరుచిక్కుడు రూ.28, దోసకాయలు రూ.24, మునక్కాడ రూ.74, అల్లం రూ.66, చిక్కుడుకాయలు రూ.26, నిమ్మకాయలు రూ.65లకు విక్రయించాలని మార్కెటింగ్ శాఖ ఆదేశాలు జారీ చేసింది.


