News September 8, 2024
జింబాబ్వేకు భారత్ సాయం

ఆకలి కోరల్లో చిక్కుకుపోయిన జింబాబ్వేకు మానవతా సాయంతో భారత్ సాయం చేసింది. ఆ దేశంతోపాటు జాంబియా, మాలావికి కూడా ఆహారం పంపింది. 1,000 టన్నుల బియ్యం, 1,300 టన్నుల మొక్కజొన్నలు, ధాన్యాలు పంపింది. ఈ మేరకు విదేశాంగశాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ ట్వీట్ చేశారు. కాగా వర్షాల లేమితో తీవ్ర కరువు ఏర్పడి ఈ మూడు దేశాలు అల్లాడిపోతున్నాయి. ఆహారం లేక చిన్నారులు అలమటిస్తుండటంతో భారత్ ఈ సాయం చేసింది.
Similar News
News January 13, 2026
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (<
News January 13, 2026
రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన స్కిల్ కేసు!

AP: స్కిల్ <<18842559>>కేసులో<<>> CBN అరెస్ట్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. 2024లో TDP నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడానికి ఈ కేసు కారణమైంది. CBN జైల్లో ఉన్న సమయంలో రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు జరిగాయి. లోకేశ్, భువనేశ్వరి, బ్రహ్మణి రోడ్లపై నిరసనలకు దిగారు. పవన్ కళ్యాణ్ జైల్లో ఆయనను పరామర్శించి TDPతో పొత్తును ప్రకటించారు. BJP కూడా కలిసిరావడంతో 2024లో కూటమి ఘనవిజయం సాధించింది. వైసీపీ ఘోర పరాభవం ఎదుర్కొంది.
News January 13, 2026
పిండివంటల కోసం ఈ చిట్కాలు

* పిండి వంటలు చేసేటపుడు నూనె పొంగకుండా ఉండాలంటే మరుగుతున్న నూనెలో తమలపాకు వేసి, అది రంగు మారాక తీస్తే సమస్య ఉండదు.
* వంటకాలు తక్కువ నూనెను పీల్చుకోవాలంటే మూకుడులో కాస్త వెనిగర్ వేయండి.
* వంటగది గట్టు మీద జిడ్డు పోవాలంటే కాస్త వంటసోడా చల్లి పీచుతో రుద్ది కడిగితే శుభ్రపడుతుంది.
*వంట నూనె నిల్వ ఉంచిన డబ్బాలో రెండు లవంగాలు వేస్తే మంచి వాసన వస్తుంది.


