News September 8, 2024
దేశంలోనే అత్యధిక వేతనం ఈయనదే!

దేశంలోనే అత్యధిక వేతనం అందుకుంటున్న ఎగ్జిక్యూటివ్గా టాటా సన్స్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ నిలిచారు. ఈ ఏడాది ఆయన రూ.135 కోట్ల వేతనం అందుకున్నారు. గతేడాదితో పోలిస్తే 20 శాతం పెరిగింది. రూ.135 కోట్ల ప్యాకేజీలో కమీషన్లు రూ.122 కోట్లు ఉండగా, రూ.13 కోట్లు జీతంగా తీసుకున్నారు. ఆయన తర్వాత సౌరభ్ అగర్వాల్-రూ.30 కోట్లు, కృతి వాసన్-రూ.25 కోట్లు, పునీత్ చత్వాల్-రూ.19 కోట్లు, టీవీ నరేంద్రన్-రూ.17 కోట్లు ఉన్నారు.
Similar News
News January 28, 2026
మిరపలో నల్ల తామర పురుగుల నివారణ ఎలా?

మిరపలో నల్ల తామర పురుగుల తీవ్రతను బట్టి ఎకరానికి 25కు పైగా నీలి రంగు జిగురు అట్టలను ఏర్పాటు చేసుకోవాలి. అలాగే బవేరియా బస్సియానా 5 గ్రాములు లేదా స్పైనటోరం 0.9ml మందును లేదా ఫిప్రోనిల్ 5% ఎస్.సి 2ML లేదా స్పైనోసాడ్ 45% ఎస్.సి 0.3MLలలో ఏదో ఒకదానిని లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. తామర పురుగు ఉద్ధృతిని బట్టి ఈ మందులను మార్చిమార్చి పిచికారీ చేయాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు.
News January 28, 2026
రాష్ట్రానికి రూ.13 వేల కోట్లు

AP: జల్జీవన్ మిషన్ కింద రాష్ట్రానికి భారీగా నిధులు రానున్నాయి. గతంలో ఆగిపోయిన సుమారు రూ.23 వేల కోట్ల పనులకు కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందులో కేంద్ర వాటాగా రూ.13 వేల కోట్లు విడుదల కానున్నాయి. 2027 నాటికి ప్రతి ఇంటికీ సురక్షిత కుళాయి నీరు అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్ కేంద్రంతో చర్చలు జరపడంతో నిధుల విడుదలకు లైన్ క్లియరైంది.
News January 28, 2026
ముడతలు, మచ్చలు తగ్గించే ఎగ్ ఫేస్ ప్యాక్

వయసు పెరిగే కొద్దీ చర్మంపై మచ్చలు ముడతలు వస్తుంటాయి. వీటిని తొలగించడంలో ఎగ్ ఫేస్ ప్యాక్ ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. ఒక ఎగ్ వైట్, కలబంద గుజ్జు, పంచదార పొడి బాగా కలిపి ముఖానికి అప్లై చేసుకోవాలి. 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో ముఖాన్ని కడిగేసుకుంటే సరిపోతుంది. ఇలా తరచూ చేస్తుంటే ముఖం అందంగా మెరిసిపోతుంది.


