News September 8, 2024

హైదరాబాద్‌లో నాకు భవనాలే లేవు: కాటసాని

image

TG: ‘హైడ్రా’ కూల్చివేసిన భవనం తనది కాదని ఏపీలోని పాణ్యం వైసీపీ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి తెలిపారు. తనకు హైదరాబాద్‌లో భవనాలే లేవన్నారు. కొందరు టీడీపీ నేతలు కావాలనే అసత్య ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తానే హైడ్రాకు నోటీసులు పంపిస్తానని కాటసాని వెల్లడించారు. కాగా అమీన్‌పూర్ పెద్దచెరువు FTLలో కాటసాని అక్రమ నిర్మాణాలను కూల్చి, ఆయనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని రంగనాథ్ తెలిపారు.

Similar News

News February 1, 2026

డ్యూటీలో ప్రాణాలు కోల్పోవడంపై సీఎం ఆవేదన

image

TG: నిజామాబాద్‌కు చెందిన ఎక్సైజ్ కానిస్టేబుల్ <<19017490>>సౌమ్య<<>> మృతి ప‌ట్ల ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి సంతాపం తెలిపారు. విధి నిర్వహ‌ణ‌లో ప్రాణాలు కోల్పోవడంపై ఆవేదన వ్యక్తం చేశారు. సౌమ్య మృతికి కార‌ణ‌మైన వారిపై క‌ఠిన‌చ‌ర్య‌లు తీసుకోవాల‌ని పోలీసు అధికారుల‌ను ఆదేశించారు. ఆమె కుటుంబానికి ప్ర‌భుత్వం అన్ని విధాలుగా అండ‌గా ఉంటుంద‌ని సీఎం హామీ ఇచ్చారు.

News February 1, 2026

కాటన్ యూనివర్సిటీలో జూనియర్ అసిస్టెంట్ పోస్టులు

image

గువాహటిలోని కాటన్ యూనివర్సిటీలో 9 జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తు హార్డ్ కాపీ, డాక్యుమెంట్స్‌ను ఫిబ్రవరి 9 వరకు పోస్ట్ చేయాలి. దరఖాస్తు ఫీజు రూ.1000, SC,STలకు రూ.500. వెబ్‌సైట్: https://cottonuniversity.ac.in/

News February 1, 2026

40% GST.. భారీగా పెరిగిన ధరలు

image

పొగాకు ఉత్పత్తులపై విధించిన 40% జీఎస్టీ నేటి నుంచి అమల్లోకి వచ్చింది. ఆ పన్నుతో పాటు అదనంగా ఎక్సైజ్ డ్యూటీ, హెల్త్ సెస్ విధించడంతో సిగరెట్లు, పాన్ మసాలా, గుట్కాల ధరలు భారీగా పెరిగాయి. హానికర ఉత్పత్తుల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. అదే విధంగా ప్రభుత్వానికి అధిక ఆదాయం వచ్చే అవకాశం ఉంది. అయితే మార్కెట్లో పొగాకు ఉత్పత్తుల ధరలు ఇప్పటికే పెంచి అమ్ముతున్నారు.