News September 8, 2024
NZB: బురద నీటిలో పడి ఒకరు మృతి

మద్యం మత్తులో బురద నీటిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన నిజామాబాద్ నగర శివారులోని గుండారం కమాన్ వద్ద జరిగింది. నాందేవ్ వాడకు చెందిన సంతలే జ్యోతిరాం(54) మద్యం మత్తులో గుండారం కమాన్ వద్ద పేరుకుపోయిన బురద నీటిలో పడి మృతి చెందాడు. ఆదివారం స్థానికులు గమనించి రూరల్ పోలీసులకు సమాచారం అందించగా వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్సై ఆరిఫ్ తెలిపారు.
Similar News
News February 26, 2026
NZB: ‘మున్సిపల్ కార్మికుల CIG గ్రూపులను కొనసాగించాలి’

మున్సిపల్ కార్మికుల సిఐజి గ్రూపులను యథావిధిగా కొనసాగించాలని TUCI, CITU, AITUC కార్మిక సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు గురువారం నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ దిలీప్ కుమార్ను కలిసి వినతిపత్రం సమర్పించారు. ఏజెన్సీ కార్మికులతో కొత్త గ్రూపులు ఏర్పాటు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎం.సుధాకర్, ఓమయ్య, ఏ.రమేష్ బాబు తదితరులు పాల్గొని కార్మికుల హక్కుల కోసం గళమెత్తారు.
News February 26, 2026
నిజామాబాద్: రూ.151 కే భద్రాచలం తలంబ్రాలు

భద్రాచలంలో మార్చి 27న జరిగే శ్రీసీతారాముల కల్యాణ తలంబ్రాలను భక్తుల ఇంటికే చేరవేస్తామని నిజామాబాద్ ఆర్ఎం జోత్స్న తెలిపారు. సంబంధించిన గోడపత్రికలను ఆవిష్కరించి మాట్లాడారు. నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల భక్తులు కేవలం రూ.151 చెల్లించి ఆర్టీసీ కార్గో కేంద్రాల్లో ఈ నెల 25 నుంచి మార్చి 31 వరకు బుక్ చేసుకోవచ్చన్నారు. రాములోరి కళ్యాణానికి వెళ్లలేని వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News February 26, 2026
NZB: ‘సైక్లింగ్ క్రీడాభివృద్ధికి కృషిచేస్తా’

నిజామాబాద్ జిల్లా సైక్లింగ్ సంఘం నూతన ప్రధాన కార్యదర్శి భూలోక విజయ్ కాంత్ రావు గురువారం జిల్లా యువజన, క్రీడా శాఖ అధికారి పవన్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాలో సైక్లింగ్ క్రీడను అభివృద్ధి చేసేందుకు క్రీడా సంస్థ తరపున పూర్తి సహకారం అందిస్తామని డీవైఎస్ఓ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జాయింట్ సెక్రెటరీ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.


