News September 8, 2024
పబ్లిసిటీకే ప్రాధాన్యం ఇచ్చిన చంద్రబాబు: కురసాల

AP: వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు విమర్శించారు. ‘CM చంద్రబాబు మీడియా పబ్లిసిటీకే ప్రాధాన్యం ఇచ్చారు. వెలగలేరు రెగ్యులేటర్ గేట్లు ఎత్తి నీరు వదులుతున్న సమాచారం ముందే తెలిసినా ప్రజల్ని గాలికి వదిలేశారు. సుమారు 20 జిల్లాల్లో వరద ప్రభావం ఉంది. 45 మంది చనిపోయినా సిగ్గు అనిపించట్లేదా? 2 లక్షలకు పైగా రైతులు నష్టపోతే సమీక్ష చేయలేదు’ అని దుయ్యబట్టారు.
Similar News
News November 9, 2025
చిరంజీవికి థాంక్స్.. అలాగే క్షమాపణలు: RGV

కల్ట్ మూవీ ‘శివ’ ఈనెల 14న రీరిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా చిత్రబృందానికి మెగాస్టార్ చిరంజీవి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ షేర్ చేశారు. ‘చిరంజీవికి ధన్యవాదాలు. నేను మిమ్మల్ని అనుకోకుండా బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను. మీ విశాల హృదయానికి మరోసారి థాంక్స్’ అని ట్వీట్ చేశారు.
News November 9, 2025
ఎయిమ్స్ మంగళగిరిలో ఉద్యోగాలు

<
News November 9, 2025
అయ్యప్ప దీక్షతో ఆరోగ్యం కూడా..

అయ్యప్ప దీక్ష 41 రోజుల పాటు ఉంటుంది. కానీ, దీని ప్రభావం ఆ భక్తులపై ఎప్పటికీ ఉంటుంది. ఈ దీక్ష ఆధ్యాత్మిక మార్గంలో నడిపించడమే కాక శారీరక, మానసిక ఆరోగ్యాన్నిస్తుంది. మెడలో రుద్రాక్ష, తులసి, చందనం, స్పటికం ధరించడం వలన ఆరోగ్య ప్రయోజనాలుంటాయి. 41 రోజుల ఈ సామాన్య జీవనం దీక్షానంతరం ఆదర్శవంతమైన ఆరోగ్యకర అలవాటుగా మారుతుంది. శబరిలో స్వామి దర్శనంతో దీక్ష ముగుస్తుంది, కానీ ఆరోగ్య జీవనశైలి మాత్రం కొనసాగుతుంది.


