News September 8, 2024
స్పోర్ట్స్ బడ్జెట్ మూడింతలు పెంచినందునే మెడల్స్: కేంద్ర మంత్రి

2014 నాటికి 143 మిలియన్ డాలర్లుగా ఉన్న క్రీడల బడ్జెట్ను బీజేపీ హయాంలో మూడింతలు పెంచి నేడు 470 మిలియన్ డాలర్లకు తీసుకొచ్చామని కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. అందుకే భారత్ ఆసియా క్రీడల్లో 117 పతకాలు, ఆసియా పారా గేమ్స్లో 111 మెడల్స్ గెలిచిందని పేర్కొన్నారు. గడచిన పదేళ్లలో క్రీడలకు సౌకర్యాల్ని, శిక్షణను, అవకాశాల్ని తమ సర్కారు గణనీయంగా మెరుగుపరిచిందని మంత్రి వివరించారు.
Similar News
News November 7, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* ఆచార్య NG రంగా 125వ జయంత్యుత్సవాలకు హాజరుకానున్న CM చంద్రబాబు
* వందేమాతరానికి 150 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. ప్రధాని పిలుపు మేరకు ఉ.9.50 గం.కు ప్రతి ఒక్కరం గేయాన్ని ఆలపిద్దాం: పవన్
* HYDలో జన్మించిన గజాలా హష్మీ వర్జీనియా గవర్నర్ కావడం తెలుగు రాష్ట్రాలకు గర్వకారణం: CM చంద్రబాబు
* పోలవరం ప్రాజెక్ట్పై ఆ ప్రాజెక్ట్ అథారిటీ రెండ్రోజుల సమీక్ష. నేడు HYDలోని కార్యాలయంలో, రేపు ప్రాజెక్ట్ ప్రాంతం పరిశీలన
News November 7, 2025
APPLY NOW: AVNLలో ఉద్యోగాలు

చెన్నై ఆవడిలోని ఆర్మ్డ్ వెహికల్ నిగమ్ లిమిటెడ్ (<
News November 7, 2025
రబీలో సాగుచేసే వరి రకాలకు ఉండాల్సిన లక్షణాలు

రబీ(యాసంగి)లో సాగు నీటి లభ్యతను బట్టి వరిని సాగు చేయాలి. అలాగే విత్తుకొనే వరి రకాల పంట కాలం 120-130 రోజుల మధ్య ఉండాలి. ముఖ్యంగా అగ్గి తెగులు, దోమ పోటును తట్టుకొనే రకాలై ఉండాలి. వర్షాలకు పైరు పడిపోని రకాలను ఎన్నుకోవాలి. మెడవిరుపును తట్టుకోవాలి. చలిని తట్టుకొని పిలకలు బాగా చేయగలగాలి. గింజరాలడం తక్కువగా ఉండాలి. మేలైన గింజ నాణ్యత కలిగి మంచి ధర వచ్చే వరి రకాలను ఎన్నుకోవాలంటున్నారు వ్యవసాయ నిపుణులు.


