News September 8, 2024

DJ విషయంలో గొడవ.. ముగ్గురు మృతి

image

గణేశ్ మండపం వద్ద DJ విషయంలో యువకుల మధ్య ఏర్పడిన వాగ్వాదం ముగ్గురి ప్రాణాలు తీసింది. ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లా నందిని PS పరిధిలో వినాయకచవితి ముందు రోజు మండపం వద్ద DJకు డాన్స్ చేస్తుండగా కొందరు యువకుల మధ్య వాగ్వాదం జరగ్గా, స్థానికుల జోక్యంతో ముగిసింది. తర్వాతి రోజు మండపం వద్ద ఇరువర్గాలు కర్రలు, మారణాయుధాలతో దాడి చేసుకోగా, ఓ వర్గానికి చెందిన ముగ్గురు యువకులు చనిపోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి.

Similar News

News December 31, 2025

EVMలతో కాదు.. ఓటర్ లిస్టులతోనే అవకతవకలు: TMC

image

ఓటర్ లిస్ట్‌లో అవకతవకలతో ఓట్ చోరీ జరుగుతోందని, EVMల ద్వారా కాదని టీఎంసీ నేత అభిషేక్ బెనర్జీ సంచలన కామెంట్స్ చేశారు. బెంగాల్‌లో SIR తర్వాత ఎలక్టోరల్ రోల్స్‌పై పార్టీల అనుమానాలను నివృత్తి చేయడంలో ఎలక్షన్ కమిషన్ ఫెయిలైందని ఆరోపించారు. ఓటర్ల సంఖ్యలో తేడాలుంటే ఫైనల్ ఓటర్ లిస్ట్‌ను TMC అంగీకరించదని, లీగల్‌గా పోరాడుతుందన్నారు. 10 మంది పార్టీ లీడర్లు ECని కలిసిన తర్వాత అభిషేక్ ఈ వ్యాఖ్యలు చేశారు.

News December 31, 2025

కంటెంట్ క్రియేటర్లకు మస్క్ గుడ్‌న్యూస్

image

‘X’లో క్వాలిటీ ఒరిజినల్ కంటెంట్ పొందడానికి క్రియేటర్లకు ఇచ్చే పేమెంట్స్ పెంచాలన్న ప్రపోజల్‌పై మస్క్ పాజిటివ్‌గా స్పందించారు. ఒరిజినల్ కంటెంట్‌ క్రియేట్ చేసే వారికి చెల్లించే మొత్తాన్ని భారీగా పెంచనున్నట్టు ప్రకటించారు. అయితే కంటెంట్‌ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామన్నారు. పారదర్శకంగా, కచ్చితంగా చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. చెల్లింపుల్లో యూట్యూబ్ అద్భుతంగా ఉందని అంగీకరించారు.

News December 31, 2025

గోదావరి నీటి మళ్లింపును అంగీకరించం: ఉత్తమ్

image

TG: AP ప్రణాళికలను అడ్డుకొని రాష్ట్ర నీటి వాటాను పరిరక్షించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ పేర్కొన్నారు. ‘గోదావరి నీళ్ల మళ్లింపును అంగీకరించం. ఏకపక్షంగా మళ్లించేందుకు ప్రయత్నిస్తే సహించే ప్రసక్తే లేదు. వారి నిర్ణయం CWC, GWDT తీర్పునకు భిన్నంగా ఉంది. అదనపు నీటి హక్కుల కోసం AP రూపొందించిన ప్రణాళికలకు వ్యతిరేకంగా ప్రభుత్వం న్యాయ పోరాటానికి పూనుకుంది. ప్రతిపక్షాల ఆరోపణల్లో వాస్తవం లేదు’ అని తెలిపారు.